Daily Archive: August 4, 2026
జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి ప్రతినిధి: శంకర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లారం వెంకట్రెడ్డి గ్రామ స్థాయి నాయకులు, సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలం ప్రజల్లోనే ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని సూచించారు....
తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తిరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అదనపు ఛార్జిషీట్ దాఖలుకు వేగంగా కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15లోపు అనుబంధ అభియోగపత్రాన్ని కోర్టులో సమర్పించేందుకు అధికారులు సన్నాహాలు...
జ్ఞాన తెలంగాణ, స్టేట్ ప్రతినిధి: తెలంగాణ యువతను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్ది దేశీయ, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలకు అనుసంధానం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు), గనులు మరియు భూగర్భశాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి...
. సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 04వెల్దండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు మారేపల్లి శ్రీను తండ్రి మారేపల్లి నిరంజన్ మరణించిన విషయం తెలుసుకున్న వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్,...
హానుమకొండ:ఫాతిమానగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (RoB) నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఫాతిమానగర్ బ్రిడ్జిపై భారీ ధర్నా నిర్వహించారు.ఈ నిరసన కార్యక్రమములో బీజేపీ హనుమకొండ జిల్లా...
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : ఎమ్మెల్యే వేముల వీరేశం 23 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 4 : పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని కట్టంగూర్,...
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 4.: తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఐసీడీఎస్ సూపర్ వైజర్ శారదారాణితో...
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,ఆగస్టు 04: గత ఉపాధి హామీ పథకం ప్రస్తుత (విబిజి రాంజీ) లో 20 గత సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎఫ్.టి ఈ(ఫిక్సిడ్ టెన్యూర్ ఎంప్లాయ్)లకు ఇస్తామని పేస్కేల్ ను కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.దానికి అనుగుణంగానే రెండు సంవత్సరాల క్రితం...
రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,ఆగస్టు 04 :వెల్దండ మండల కేంద్రానికి చెందిన మారేపల్లి నిరంజన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్...
జ్ఞాన తెలంగాణ ప్రతినిధి:ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఆలమట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి భారీగా నీటి విడుదలతో శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం రాత్రి నాటికి జలాశయానికి 1.55 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో జలాశయంలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది....