ఉప్పల వెంకటేష్ పిలుపుతో బండోనిపల్లిలో కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

వెల్దండ సెప్టెంబర్ 06:రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు,ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుల పిలుపుతో బండోనిపల్లిలో ఉప సర్పంచ్ అల్వాల్ యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 1000 రోజులు అయినా 6 గ్యారంటీలు,420 హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బాకీ కార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించారు.ఉపసర్పంచ్ అల్వాల్…

కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదారణ

కల్వకుర్తి సెప్టెంబర్ 06: కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకూ ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోందని,కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ లోని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నివాసంలో కడ్తాల్ మండలంలోని ముద్విన్, గడ్డమీది తాండా గ్రామ పంచాయతీలకు చెందిన పలువురు వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు…

మృతురాలి కుటుంబానికి భాస్కరరావు ఆర్థిక సహాయం

కల్వకుర్తి సెప్టెంబర్ 06:చారకొండ మండలంలోని గోకారం గ్రామానికిచెందిన పంజుగుల రాములమ్మ ఇటీవల ఆకస్మికంగా మరణించారు.వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు మృతుని కుటుంబానికి భాస్కర్ రావు యువసేన సభ్యుల ద్వారా రూ.5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పంజుగుల పరుశరాములు,కొండల్,రషీద్,గజ్జెశ్రీను, వెంకటయ్య,శ్రీను,రవి,అల్లాజీ మహేష్,కరుణాకర్,వెంకటరెడ్డి,లక్ష్మారెడ్డిసాదిక్ అలీ మల్లయ్య, జూపల్లిభాస్కర్ రావు యువసేన అధ్యక్షుడు ఎండి సిరాజ్,జూపల్లి భాస్కర్ రావుయువసేన సభ్యులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి‌‌.. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కల్వకుర్తి సెప్టెంబర్ 06:యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని ఐక్యత పౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి సీసీటీ కెమెరా సొల్యూషన్స్ కమ్యూనికేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతనంగా వ్యాపార, ఉద్యోగాల కోసం ఎదురుచూడటంతో పాటు,స్వయం ఉపాధిని ఎంచుకుని మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి యువత ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆర్.పి.ఎం సిసి టీవీ కెమెరా సొల్యూషన్స్,నిర్వాహకులు రమేష్ & చాయ్ దోస్తీ టీ…

డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలి

డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలి : మండల వ్యవసాయ అధికారి వై.గిరిప్రసాద్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 6 : డిజిటల్ సర్వేకు రైతులు సహకరించాలని మండల వ్యవసాయ అధికారి వై.గిరి ప్రసాద్ అన్నారు. ఆదివారం మండలంలోని ఈదులూరు గ్రామంలో పత్తి పంటలను పరిశీలించి డిజిటల్ క్రాప్ సర్వేపై రైతులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పత్తి పంటలో బెట్ట వాతావరణ పరిస్థితులను తట్టుకనేందుకు లీటర్ నీటికి 2 శాతం యూరియా ద్రావణం లేదా 19.19.19, 13.0.45…

ప్రాణాపాయంలో ఉన్న వానరానికి మానవత్వంతో ప్రథమ చికిత్స

ప్రాణాపాయంలో ఉన్న వానరానికి మానవత్వంతో ప్రథమ చికిత్స

ప్రాణాపాయంలో ఉన్న వానరానికి మానవత్వంతో ప్రథమ చికిత్సజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 6 : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వానరానికి ఓ గోపాలమిత్రుడు మానవత్వంతో అండగా నిలిచారు. కట్టంగూర్ మండలం‌ అయిటిపాముల గ్రామ పరిధిలోని చెర్వుఅన్నారం అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం డీసీఎం వాహనం ఢీకొనడంతో ఓ వానరం తీవ్రంగా గాయపడింది. కదలలేని స్థితిలో రోడ్డుపక్కన పడి ఉన్న వానరాన్ని చూసిన వారు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో అటుగా…

ఆలయ అభివృద్ధికి సుంకిరెడ్డి రూ. లక్ష 70 వేల విరాళం

ఆలయ అభివృద్ధికి సుంకిరెడ్డి రూ. లక్ష 70 వేల విరాళం

కల్వకుర్తి సెప్టెంబర్ 06: తలకొండపల్లి మండలం చుక్కపూర్ ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,టాస్క్ సి.ఓ.ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పన కోసం రూ.1లక్ష డెబ్భై వేల రూపాయల చెక్కును ఆలయ నిర్వాహకులు వెంకటేశ్వర శర్మకు అందజేశారు.అనంతరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు.గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కర్రోలి దశరథం…

బల్మూర్ మండలంలో బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్.!

బల్మూర్ సెప్టెంబర్ 06: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని బల్మూర్ మండల కేంద్రంలో సోమవారం శాంతియుతంగా ధర్నాకు సిద్ధమవుతున్న బీజేపీ మరియు బీజేవైఎం ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.ప్రభుత్వ నిరంకుశ వైఖరికి, పోలీసుల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతుంటే అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. అరెస్టయిన ముఖ్య నాయకులలో బాలస్వామి యాదవ్, బల్మూర్ మండల బీజేపీ అధ్యక్షులు…

అడుగడుగునా గుంతలు.. రాకపోకలకు అవస్థలు.. 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డుకు మరమ్మతులు కరువు శిథిలమైన కురుమర్తి రోడ్డు…

అడుగడుగునా గుంతలు.. రాకపోకలకు అవస్థలు..20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డుకు మరమ్మతులు కరువుశిథిలమైన కురుమర్తి రోడ్డు…జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 06: కట్టంగూర్ నుంచి కురుమర్తి కి వెళ్లే రోడ్డు ద్వంసం కావడంతో వాహనదారులు ఇక్కట్లు వడుతున్నారు. 8 కిలో మీటర్ల మేర అడుగడుగునా గుంతలు పడి అధ్వానంగా మారింది. దీంతో ఈరోడ్డుపై వెళ్లాలంటే వాహనదారులు జంకుతున్నారు. రాత్రిపూట అయితే నరకం చూడాల్సిందే అని భయాందోళన చెందుతున్నారు. సుమారు 20 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన్ కింద కట్టంగూర్ నుంచి కురుమర్తికి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డు ద్వంసం కావడంతో ఓ సారి తూతూ మంత్రంగా మరమ్మత్తులు చేపట్టి చేతులుదుపుకున్నారు. రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో మండలంలోని గార్లబాయిగూడెం, తేలువారిగూడెం గ్రామాలతో పాటు శాలిగౌరారం మండలం ఆకారం, వల్లాల, గురజాల గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం కురమర్తి గ్రామం మీదుగా కట్టంగూర్ కూ రాకపోకలు సాగించాలంటే జంకుతున్నారు. పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో రెండువాహనాలు ఎదురెదురుగా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. సత్యనారాయణపురం, కురుమర్తి శివారులో రోడ్డు మద్యలో గోతులు పడడంతో అందులో పడి ఎంతో మంది ద్విచక్రవాహనదారులకు గాయాలయ్యాయి. రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని పలుమార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని ఆయా గ్రామాల ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.  పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేయాలి : బీరెల్లి రామచంద్రయ్య మాజీ ప్రజాప్రతినిధుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులునిత్యం రద్దీగా ఉంటే కట్టంగూర్ నుంచి కురుమర్తికి వెళ్లే రోడ్డును పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలి. గత 20 సంవత్సరాల క్రితం నిర్మించి రోడ్డు వర్షాలకు ద్వంసం అయి రోడ్డుపై గుంతలు పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. గత ఐదు సంవత్సరాల నుంది వాహనదారులు రోడ్డు పై ప్రయాణించాలంటే భయాంతోళన చెందుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందించి కట్టంగూర్, శాలిగౌరారం మండల ప్రజల నిత్యం రాకపోకలు సాగించే ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలి

నిషేధిత భూమి రిజిస్ట్రేషన్‌.. సబ్‌ రిజిస్ట్రార్‌ అరెస్టు

నిషేధిత భూమికి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యవహారంలో సబ్‌ రిజిస్ట్రార్‌ అరెస్టు కావడం నిజామాబాద్‌ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అర్సపల్లి శివారులోని సర్వే నంబర్‌ 169/3లో...