పోచమ్మ బోనాలు విజయవంతం చేయండి.. సర్పంచ్ ప్రసాద్ గౌడ్

బొల్లంపల్లి, సెప్టెంబర్ 08: బొల్లంపల్లి, చల్లపల్లి, అంకమోనికుంట, ఈదమ్మ బండ తండా గ్రామాల ప్రజలందరికీ బొల్లంపల్లి గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.రేపు బుధవారం సెప్టెంబర్ 9న గ్రామంలోని పోచమ్మ ఆలయంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు*. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. బోనాల వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

దళిత స్పీకర్ ను అవమానించిన తాత మధు పై చర్యలు తీసుకోవాలి.. పుల్లయ్య

వెల్దండ సెప్టెంబర్ 08 : దళిత స్పీకర్ ను అవమానించిన బీఆర్ఎస్ నేత తాత మధు తీరుపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెల్దండ మండలంలో కాంగ్రెస్ సీనియర్ నేత కొయ్యల పుల్లయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. దళిత స్పీకర్ ను అవమానించడం దారుణమని, ఇది బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.తాత మధు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.న్యాయం జరిగే వరకు…

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.ప్రజల గొంతును అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 8: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఏడు రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం నకిరేకల్‌లో బీఆర్‌ అంబేద్కర్…

మా కష్టార్జిత బకాయిలు చెల్లించే వరకు పోరాటం ఆగదు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు

బాన్సువాడ : 2017 పేస్కేల్ ఏరియర్స్‌తో పాటు రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగులు చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో బాన్సువాడ పోలీసులు ముగ్గురు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులను మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండేందుకు ఉదయం సుమారు 5 గంటల సమయంలో రిటైర్డ్ ఉద్యోగుల ఇళ్ల వద్దకు చేరుకున్న పోలీసులు ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి దోసెపల్లి శంకర్, RTD డీఐ ఎం.డి.ఎస్….

రాజ్యాంగ నిర్మాత సాక్షిగా ప్రజా హక్కులపై వినతి.. భారత రాష్ట్ర సమితి

వెల్దండ సెప్టెంబర్ 08:వెల్దండ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వెల్దండ భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆహార కమిషన్ అధ్యక్షులు గోలి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వినతి చేస్తున్నామని, 2023 ఎన్నికల్లో ఇచ్చిన 6…

స్వచ్ఛమైన నీరు – సంపూర్ణ ఆరోగ్యమే ఐక్యత పౌండేషన్ లక్ష్యం: సుంకిరెడ్డి

వెల్దండ 08: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అంకమోనికుంట గ్రామంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ధార కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఐక్యత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో జర్మన్ టెక్నాలజీతో తయారైన ప్రత్యేక యంత్రాలతో నీటి ట్యాంక్ ను శుభ్రపరిచారు.గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.శుద్ధ జలం అందించి ప్రజల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తున్నామని, ప్రతి బొట్టు స్వచ్ఛత కోసం…

వినాయక ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు

వినాయక ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదునిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఎస్‌ఐ మునుగోటి రవీందర్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 8 : వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కట్టంగూర్ ఎస్‌ఐ మునుగోటి రవీందర్ సూచించారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక మండపాలు, నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, అధిక శబ్దంతో కూడిన లౌడ్‌స్పీకర్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. స్పీకర్లను నిబంధనలకు అనుగుణంగా తక్కువ శబ్దంతో రాత్రి…

పేద కుటుంబానికి గోలి ఆపన్న హస్తం.. అనిత గృహ నిర్మాణానికి చేయూత

వెల్లడం సెప్టెంబర్ 08:వెల్దండ మండల పరిధిలోని రాచుర్ గ్రామానికి చెందిన తెలగమళ్ళ అనిత రవికుమార్ గృహ నిర్మాణానికి మంగళవారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి 10 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేసి ఉదారత చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల చీకటి జీవితాలలో వెలుగులు నింపేందుకు గృహ నిర్మాణాలకు తన వంతుగా సహకారం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపి, మండల పార్టీ అధ్యక్షులు రాంరెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ…

వెల్దండ శివుని గుట్ట గుండంలో విరబూసిన తామరలు

వెల్దండ సెప్టెంబర్ 07 : నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని శివుని గుట్ట గుండంలో తెల్ల కలువ పుష్పాలు విరబూశాయి.ఆదివారం ఉదయం గుండంలో మూడు పువ్వులు వికసించడం భక్తులు ఆనందంతో వీక్షించారు.శివుడికి తెల్ల తామరలు అత్యంత ప్రీతికరమని అర్చకులు తెలిపారు.ఒకేసారి మూడు పువ్వులు పూయడం శుభ సూచకమని భక్తులు భావిస్తున్నారు. వీక్షించి ఫోటోలు తీసేందుకు భక్తులు గుండం వద్దకు అధిక సంఖ్యలో చేరుకున్నారు. భక్తుల సౌకర్యార్థం కోసం గుండం చుట్టూ ప్రహరీని నిర్మించి, మెట్లు…

కడ్తాల్ లో ఘనంగా బోనాలు ఉత్సవాలు.. ముఖ్య అతిథిగా పాల్గొన్న విజితా రెడ్డి

కడ్తాల్, సెప్టెంబర్ 7:రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో బోనాల ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారురాలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్,వెల్దండ మాజీ జెడ్పీటీసీ విజితా రెడ్డిహాజరయ్యారు. ఆమె బోనం ఎత్తుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు.గ్రామంలోని అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన బోనాల ఊరేగింపు ప్రధాన వీధుల మీదుగా కోలాహలంగా సాగింది. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో పాల్గొన్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ..బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని,అమ్మవారి…