కల్వకుర్తిలో విషాద ఘటన వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్ తో యువకుడు బలి
కల్వకుర్తి, సెప్టెంబర్ 19: వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతి చెందిన విషాద ఘటన కల్వకుర్తి పట్టణ కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామానికి చెందిన జంపుల అరవింద్ (26) బీజేవైఎం మండల జనరల్ సెక్రెటరీ వినాయక మండపం వద్ద అలంకరణ కోసం ఏర్పాటు చేసిన కాషాయ తోరణాలపై వర్షం కారణంగా పడిన విద్యుత్ తీగలను తొలగించే ప్రయత్నం చేశాడు….
