సింగపూర్‌లో యూనిఫాంలు, వర్క్‌బుక్స్ పంపిణీ

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సింగపూర్‌లో విద్యార్థులకు యూనిఫాంలు, ప్రీ-ప్రైమరీ చిన్నారులకు వర్క్‌బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ రావు ఎర్ర, 9వ వార్డు కౌన్సిలర్ గణేష్, 10వ వార్డు కౌన్సిలర్ రాజన్ల వసంత మహేందర్ రెడ్డి, గౌరవ...

ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయనిధి వరం

వెల్దండ ఆగస్టు 31: ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలా ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన మహమ్మద్ యూసుఫ్ ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆస్పత్రి ఖర్చులకు ఇబ్బందిగా ఉన్న విషయాన్ని గ్రామ సర్పంచ్ శాంపురి శారద చెన్నయ్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సోమవారం బాధిత కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు. సందర్భంగా సర్పంచ్ మరియు బాలిక కుటుంబం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య యాదవ్, సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ యువ నాయకులు ఎండి సద్దాం, కాలూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రేపే శంకర్‌పల్లిలో రేషన్‌ కార్డుల పంపిణీ

శంకర్‌పల్లి మండల ప్రజలకు నూతన ప్రభుత్వ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం రేపు సెప్టెంబర్‌ 1న ఉదయం 11 గంటలకు శంకర్‌పల్లి MPDO కార్యాలయంలో జరగనుంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గారి చేతుల మీదుగా కార్డుల పంపిణీ చేపట్టనున్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ...

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష

తెలంగాణలో విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.బీజేపీ చేపట్టిన ‘ఫీజుల బకాయి – బీజేపీ...

రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి

రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు.సోమవారం, రాష్ట్రంలోని రైల్వే రోడ్డు ప్రాజెక్టుల భూసేకరణ, రైల్వే విస్తరణ, డబుల్ లైన్, ప్రగతి ప్రాజెక్టుపై హైదరాబాదు నుంచి *రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్...

ఓబీసీ సెల్ నూతన కమిటీలకు దరఖాస్తుల ఆహ్వానం

జనగామ: జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఓబీసీ సెల్ నూతన కమిటీల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభం కానుంది.జిల్లా, అసెంబ్లీ, డివిజన్, మండల, టౌన్ మరియు గ్రామ స్థాయిలలో ఛైర్మెన్ మరియు కమిటీ సభ్యుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు....

ఐటీఐ, ఏటీసీ కోర్సుల్లో వాక్‌-ఇన్ అడ్మిషన్లు

జ్ఞాన తెలంగాణ,జనగామ ప్రతినిధి,ఆగస్టు 31:తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలకు చెందిన యువతీ యువకులకు ప్రభుత్వ, ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థలు ITI,అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ ATCల్లో 2026-27/28 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం వాక్‌-ఇన్ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రభుత్వ ఐటీఐ ఆలేరు...

ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం

సోమవారం, మహబూబాబాద్, కలెక్టరేట్ లో గృహ నిర్మాణ, రెవెన్యూకు సంబంధించిన అంశాలపై ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో సమీక్షిస్తున్న *రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు సీతక్క,...

నిలిచిపోయిన డబల్ బెడ్ రూములకు మోక్షం కల్పించాలి సిపిఐ డిమాండ్

నిలిచిపోయిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు ను నిర్మించి నిరుపేదలకు ఇవ్వాలని సిపిఐ మండల కార్యదర్శి ఏ .విటల్ గౌడ్ సోమవారం డిమాండ్ చేశారు, కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కోటగిరి ప్రజావాణిలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి పంపిణీ చేయాలని...