వల్లంటీర్లలో 984 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగార్థులకు మరో శుభవార్త అందించింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న 984 వల్లంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అగ్రికల్చర్ యూనివర్సిటీలో 550 పోస్టులు, ఆచార్య కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లిన భక్తులకు 12 నుంచి 15 గంటల వరకు నిరీక్షణ తప్పడం లేదు. అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోగా,...

విద్యార్థులకు కారంతో అన్నం..

మంచిర్యాల: జిల్లాలోని చెన్నూర్ ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా భోజనం అందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆహారం సిద్ధం చేయకపోవడంతో పలువురు విద్యార్థులు కేవలం కారంతో అన్నం తిని ఆకలి తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన విద్యాసంస్థలో...

వీర తెలంగాణ అగ్గిరవ్వ దొడ్డి కొమురయ్య…

తెలంగాణ చరిత్రలో జులై 4 అతి ముఖ్యమైన రోజు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అంకురార్పణ జరిగిన రోజు. భారతదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్రలోనే మహౌజ్వల ఘట్టంగా భాసిల్లిన వీర తెలంగాణ పోరాటాన్ని రగిలించిన అగ్గి రవ్వ.. దొడ్డి కొమరయ్య అమరుడయిన రోజు. కొమురయ్య అమరత్వానికి నేటితో...

భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత.. పలువురు బీజేపీ నేతల అరెస్ట్

వరంగల్: భద్రకాళి ఆలయం వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తడిబట్టలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆలయంలోకి ప్రవేశించారంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఆలయ ఆచారాలు, సంప్రదాయాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, పోలీసుల...

వ్యభిచారానికి ‘గోప్యత’ కవచం కాదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమ అక్రమ సంబంధాలను కప్పిపుచ్చుకునేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్-21 కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కును రక్షణ కవచంగా వినియోగించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భార్య లేదా భర్త వివాహేతర సంబంధాన్ని నిరూపించేందుకు అవసరమైతే మొబైల్ కాల్ డేటా రికార్డులు (CDRలు),...

ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తంలను రెండేళ్ల కాలపరిమితితో అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు....

23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్ర హోంశాఖ

యూఏపీఏ కింద నోటిఫికేషన్ జారీ న్యూఢిల్లీ: దేశ భద్రతకు ముప్పుగా మారిన 23 మందిని కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఈ మేరకు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రకటించిన వారిలో 17 మంది పాకిస్తాన్ జాతీయులు, ఆరుగురు...

కడప స్టీల్ ప్లాంట్‌పై క్రెడిట్ చోరీకి చంద్రబాబు పాల్పడ్డారు: అవినాష్ రెడ్డి

కడప: కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి తానే కృషి చేసినట్లు ప్రచారం చేసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు ఈ దశకు చేరుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి...

టెలిగ్రామ్‌కు మళ్లీ కేంద్ర ప్రభుత్వ నోటీసులు

పైరసీ ఆరోపణల నేపథ్యంలో చర్యలు న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర కాపీరైట్ కలిగిన డిజిటల్ కంటెంట్‌ను అక్రమంగా పంచుతున్న ఛానళ్లు, గ్రూపులపై చర్యలు తీసుకోవడంలో వైఫల్యం ఉందన్న పైరసీ ఆరోపణల...