ఆర్‌ఆర్‌ఆర్‌కు కేంద్రం బ్రేక్‌!

తెలంగాణ భవిష్యత్‌ ప్రాజెక్టుకు కేంద్రం వద్ద ఎందుకీ జాప్యం? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక రూపురేఖలను మార్చగల ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) ఒకటి. హైదరాబాద్‌ చుట్టూ విస్తరిస్తున్న పట్టణీకరణకు దిశానిర్దేశం చేయడంతో పాటు పారిశ్రామిక కారిడార్లు, ఫ్యూచర్‌ సిటీ, కొత్త పెట్టుబడులు,...

భాగ్యనగరంలో భక్తి వైభవం.. కొలువుదీరిన స్వర్ణ గణనాథుడు

వినాయక చవితి పర్వదినం సందర్భంగా భాగ్యనగరం భక్తి పారవశ్యంతో ముస్తాబైంది. నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రం బేగంబజార్‌ పరిధిలోని ఫీల్‌ఖానా ప్రాంతంలో కొలువుదీరిన అరుదైన స్వర్ణ గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కళాత్మక వైభవం, అపూర్వ అలంకరణ, దివ్యమైన రూపంతో దర్శనమిస్తున్న ఈ గణనాథుడిని వీక్షించేందుకు...

పొంగులేటి బుకాయింపుల బాగోతం.. హరీశ్‌రావు ఫైర్‌

నిషేధిత భూముల వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే ధోరణి ప్రదర్శించారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల ముందున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన మంత్రి.. ఎదురుదాడి, వ్యక్తిగత విమర్శలు, అర్ధసత్యాల చాటున అసలు అంశాన్ని...

బ్రిక్స్‌లో భారత్‌ దౌత్య సత్తా.. విభేదాల మధ్య ఏకాభిప్రాయం

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విభేదాలు ముదురుతున్న వేళ భారత్‌ వేదికగా జరిగిన బ్రిక్స్‌ సదస్సు దౌత్యరంగంలో కీలక మైలురాయిగా నిలిచిందని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ నిర్వహించిన ఈ సదస్సు.. పరస్పర విరుద్ధ అభిప్రాయాలు కలిగిన...

తలకొండపల్లిలో మట్టి వినాయకుల ఉచిత పంపిణీ

తలకొండపల్లి: కల్వకుర్తి నియోజకవర్గం, తలకొండపల్లి మండల కేంద్రంలో జై శ్రీరాం యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుల ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కటికల శేఖర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యూత్ వ్యవస్థాపకులు పద్మ అనిల్ ముదిరాజ్, అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పద్మ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విగ్రహాలను శ్రీకాంత్ యాదవ్ అందించారు.వార్డు సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. మట్టి…

జిల్లా గ్రంథాలయంలో పారిశుద్ధ్య లోపాలు పిచ్చి మొక్కలు, దోమలతో విద్యార్థుల ఇబ్బందులు.

జనగామ జిల్లా కేంద్ర గ్రంథాలయం పరిసరాలు పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుద్ధ్య లోపాలతో దోమలు, ఇతర కీటకాలు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు దోమల నివారణకు ఫాగింగ్, మందు పిచికారీ చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.

వినాయక చవితి రోజు కూడా ఆగని సేవ – సుంకిరెడ్డి కంటి శిబిరానికి పోటెత్తిన జనం

కడ్తాల్ సెప్టెంబర్ 14: కడ్తాల్ ఎంబీఏ గార్డెన్స్ లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో, శంకర నేత్రాలయ చెన్నై వారిచే నిర్వహిస్తున్న 6వ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం 4వ రోజు కూడా నిరంతరాయంగా కొనసాగింది.వినాయక చవితి పండుగ రోజున కూడా శిబిరానికి సెలవు లేకుండా వైద్య సేవలు కొనసాగడంతో కడ్తాల్ మండలం, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాలుగు రోజులలో…

వెల్దండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొలువైన గణనాధుడు

వెల్దండ, సెప్టెంబర్ 14:వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు హరి కిషన్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుని పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మట్ట యాదమ్మ, వెంకటయ్య గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్, పర్వత్ రెడ్డి, ప్రసాద్ గౌడ్, రామకృష్ణ, పుల్లయ్య, వెంకట్ నాయక్, లాలు నాయక్, భరత్ గౌడ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ షాక్ బాధితుడికి భాస్కర్ రావు భరోసా – రూ. 20 వేల ఆర్థిక సాయం

వెల్దండ సెప్టెంబర్ 14: వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు గారు మానవత్వం చాటుకున్నారు.చెదురుపల్లి గ్రామానికి చెందిన పోలే శ్రీరాములు 15 రోజుల క్రితం విద్యుత్ షాక్ కు గురై కల్వకుర్తి మహిత హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న భాస్కర్ రావు వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వెల్దండ మాజీ ఎంపీపీ వెంకటయ్య గౌడ్, చెదురుపల్లి సర్పంచ్ దన్సింగ్ నాయక్…