ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకానికి శ్రీకారం చుట్టింది. డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం...

KCR బావమరిది శ్రీనివాసరావు మృతి

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసరావు మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.శ్రీనివాసరావు మృతదేహాన్ని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో...

బోనాల వేడుకలకు భద్రత.. సీఐ రుద్రవీర్‌కు ఘన సన్మానం

శంకర్ పల్లి మున్సిపాలిటీ 1వ వార్డు భవానీనగర్‌లోని పోచమ్మ తల్లి ఆలయంలో మంగళవారం సాయంత్రం సీఐ రుద్రవీర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శంకర్‌పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆలయ కమిటీ అధ్యక్షుడు మడపతి చంద్రమౌళి, 1వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ రావు...

కొట్ర గ్రామంలో వివాహిత దారుణ హత్య

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి, ఆగస్టు 13 : వివాహిత యువతి దారుణ హత్యకు గురైన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొట్ర గ్రామానికి చెందిన నారుమళ్ళ అనూష (22) బుధవారం రాత్రి...

సర్కారు భూములకు ‘సేల్’ బోర్డు!

భూముల విక్రయాల ద్వారా భారీగా ఆదాయం సమీకరించడమే లక్ష్యంగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మరోసారి మెగా ఈ-వేలానికి సిద్ధమైంది. నగరంలో ప్రభుత్వ భూములకు పెరుగుతున్న డిమాండ్‌, గత వేలాల్లో నమోదైన రికార్డు ధరలను దృష్టిలో పెట్టుకుని విలువైన భూములను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. మొత్తం భూ...

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు రాజకీయ గండం!

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ తరఫున గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల రాజకీయ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారిందన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. అభివృద్ధి పనులకు నిధులు వస్తాయనే ఆశతో అధికార కాంగ్రెస్‌లో చేరిన వారికి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదనే...

మెదక్‌ మెడికల్‌ కాలేజీలో 156 ఉద్యోగాలు

మెదక్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ నితిన్‌ కాబ్ర తెలిపారు. కాంట్రాక్ట్‌ విధానంలో 4 ప్రొఫెసర్లు, 5 అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 6 సీనియర్‌ రెసిడెంట్లు, 3 ట్యూటర్ల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని...

ఆధార్ కోసం డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌ లేని పిల్లలకు అవకాశం

డొమిసైల్‌ సర్టిఫికెట్‌తో ఆధార్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌ అందుబాటులో లేని పిల్లలకు ఆధార్‌ నమోదు విషయంలో ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులో ఉన్నట్లు సమాచారం. సంబంధిత నిబంధనలకు అనుగుణంగా డొమిసైల్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా ఆధార్‌ నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది....

డీఈఎల్‌ఈడీ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed.) మొదటి సంవత్సరం మే–2026 పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఆగస్టు 13, 2026 నుంచి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పరీక్షల డైరెక్టర్ కార్యాలయం వెల్లడించింది.అభ్యర్థులు తమ ఫలితాలను...

గైర్హాజరీ టీచర్లపై ఇకపై కఠిన చర్యలు!

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్, ఆగస్టు 13: ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిపై ఇకపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ Rc.No.Spl/Ser.IV/2026, తేదీ 11-08-2026తో మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొంది. దీర్ఘకాలంగా విధులకు దూరంగా...