వెల్దండలో వీబీజీ రాంజీ ఉద్యోగుల నిరసన.!
- శంకర్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - August 16, 2026
- రాష్ట్రపతి భవన్లో ఘనంగా ఎట్ హోమ్ రిసెప్షన్ - August 15, 2026
- అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు - August 15, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,ఆగస్టు 04:

గత ఉపాధి హామీ పథకం ప్రస్తుత (విబిజి రాంజీ) లో 20 గత సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎఫ్.టి ఈ(ఫిక్సిడ్ టెన్యూర్ ఎంప్లాయ్)లకు ఇస్తామని పేస్కేల్ ను కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది.దానికి అనుగుణంగానే రెండు సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 2024 నాడు ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం పొంది ప్రకటనకు ముందు నిలిచిపోయింది.అది ఇప్పటివరకు అమలు కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం విబిజి రాంజీ ఉద్యోగులకు ప్రకటించిన పే స్కేల్ ను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఇతర సమస్యలను అమలు చేయాలని కోరుతూ వెల్దండ మండలంలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన చేయడం జరిగింది. బుధవారం ఆగస్టు 05 నుండి విబిజిరాంజీ పథకంలో పే స్కేల్ అమలయ్యే వరకు ఎలాంటి పనులు జరగకుండా షట్ డౌన్ కార్యక్రమం ఉదృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏపీవో ఈశ్వర్ జి, ఈసీ దేవేందర్ గౌడ్ ,ఏ.సి.ఓ లు కే రాము, ఎస్ హుస్సేన్, టెక్నికల్ అసిస్టెంట్లు లింగస్వామి కృష్ణవేణి, శివలీల, సత్యనారాయణ, రేణమ్మ తదితరులు పాల్గొన్నారు.
