బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పైలెట్ రోహిత్ రెడ్డి

పితృవియోగంతో దుఃఖంలో ఉన్న బీరం హర్షవర్ధన్ రెడ్డిని పరామర్శించిన పైలెట్ రోహిత్ రెడ్డి1001195954.jpg

కొల్లాపూర్: సింగోటలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వెళ్లి పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...