Daily Archive: September 18, 2026

నిమజ్జనాల్లో నిర్లక్ష్యానికి నో ఛాన్స్‌! శంకర్‌పల్లి సీఐ రుద్వీర్‌ కుమార్‌ కఠిన హెచ్చరిక

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: వినాయక నిమజ్జనాల నేపథ్యంలో శంకర్‌పల్లి పోలీసులు అప్రమత్తమయ్యారు. మండపాలు ఏర్పాటు చేసి ఐదు రోజులు పూర్తవడంతో నిమజ్జనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఐ రుద్వీర్‌ కుమార్‌ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అత్యుత్సాహంతో ఊరేగింపులు నిర్వహించడం, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడం, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు, సౌండ్‌ సిస్టమ్‌లు వినియోగించడం వంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో ఈత రాని వారు నీటిలోకి దిగకుండా నిర్వాహకులు…

నిమజ్జనాల్లో నిర్లక్ష్యానికి నో ఛాన్స్‌.. శంకర్‌పల్లి సీఐ రుద్వీర్‌ కుమార్‌ హెచ్చరిక!

శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా లోని ఫ్యూచర్‌ సిటీ పరిధిలోని శంకర్‌పల్లి సీఐ రుద్వీర్‌ కుమార్‌ నిమజ్జన వేడుకలపై కఠిన హెచ్చరికలు జారీ చేసారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసి నేటికి ఐదు రోజులు పూర్తికాగా,పలు మండపాల్లో నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం ఏడు, తొమ్మిది రోజుల మండపాల నిమజ్జనాలు కూడా వరుసగా జరిగే అవకాశం ఉండటంతో పోలీస్‌ యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలకు సిద్ధమవుతోంది. నిమజ్జన ఊరేగింపుల్లో అత్యుత్సాహం, మద్యం సేవించి వాహనాలు…

గుండాలలో జక్కుల రాములు కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ

వెల్దండ, సెప్టెంబర్ 18: గుండాల గ్రామ సర్పంచ్ జక్కుల వెంకటయ్య తండ్రి జక్కుల రాములు మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జక్కుల రాములు పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు భూపతిరెడ్డి, వెల్దండ సర్పంచ్ మట్ట వెంకటయ్య గౌడ్, కంటోన్‌పల్లి సర్పంచ్ లక్ష్మణస్వామి, కాంగ్రెస్ నాయకులు రషీద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మట్ట భరత్…

చౌదర్ పల్లి గణేష్ ఉత్సవాలకు సింగిల్ విండో చైర్మన్ రూ.25 వేల విరాళం

వెల్దండ, సెప్టెంబర్ 18: వెల్దండ మండలం చౌదర్‌పల్లిలో గణేష్ ఉత్సవ కమిటీకి వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు రూ.25 వేల విరాళాన్ని అందజేశారు. గణేష్ మండపంలో మైక్ సెట్ ఏర్పాటు కోసం ఈ విరాళాన్ని అందించినట్లు ఆయన తెలిపారు.అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భాస్కరరావు పేర్కొన్నారు. సమాజ మనుగడకు భక్తి, భావనలే ఆధారమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దొబ్బల రాజీవ్, వార్డు సభ్యులు భరత్,నరేష్,వంశీ…

లంచం వసూళ్లకు తెరలేపిన తహసీల్దార్‌.. ఏసీబీకి చిక్కిన సృజన్‌కుమార్‌

జ్ఞాన తెలంగాణ, ములుగు: గోవిందరావుపేట తహసీల్దార్‌ సృజన్‌కుమార్‌ లంచం డిమాండ్‌ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. తండ్రి, కొడుకుల మధ్య నెలకొన్న భూ వివాదాన్ని పరిష్కరించేందుకు రూ.14 వేల లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు అందిన ఫిర్యాదుపై స్పందించిన ఏసీబీ అధికారులు తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం. లంచం డిమాండ్‌, ఏసీబీ చర్యలకు…

బాధిత కుటుంబానికి అంజి మాస్టర్ ఆర్థిక సహాయం

వెల్దండ సెప్టెంబర్ 18: మండల పరిధిలోని పోతెపల్లి గ్రామంలో వావిల్ల వసంత గురువారం ఉదయం మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకొని అంజి మాస్టర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ ఆర్థిక సహాయంగా రూ.3 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు .ఈ కార్యక్రమం లో అంజి మాస్టర్,తగుళ్ల చంద్రయ్య, , బోయినిపల్లి నిరంజన్ గౌడ్,చిన్న సైదయ్య, కొమ్ము వెంకటయ్య,కుమ్మరి శ్రీశైలం,రామస్వామి, పార్వతాలు,వార్డు సభ్యులు ఊడతబాలస్వామి,కుమ్మరి శివ, గోరటి అశోక్ కుమార్, పాల్గొన్నారు.

ఎఫ్ పి ఓ తో రైతుల అభివృద్ధికి బాటలు – సింగిల్ విండో చైర్మన్ భాస్కరరావు

వెల్దండ, సెప్టెంబర్ 18: ఉమ్మడి వెల్దండ మండలంలోని సింగిల్ విండో రైతులందరూ రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీవో)ను సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రావు కోరారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌పీవోలో 750 మంది రైతులు రూ.2 వేల చొప్పున సభ్యత్వం పొందితే రూ.15 లక్షలు జమ అవుతాయని, కేంద్ర ప్రభుత్వం మరో రూ.15 లక్షలు అందిస్తుందని తెలిపారు. దీంతో సహకార సంఘాలు బలోపేతం కావడంతో పాటు రైతులకు నాణ్యమైన…

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం చెక్కు అందజేత:-

వెల్దండ మండలంలోని పోతేపల్లి గ్రామంలో ఇటీవల నూనె కృష్ణయ్య మృతి చెందడంతో వారి కుటుంబాలకు ప్రభుత్వం నేషనల్ ఫ్యామిలీ బేనిఫీట్ స్కీమ్ ( NFBS ) కింద మంజూరు చేసిన రూ. 2 వేల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును మంగళవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొండల్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అవసరమైన వారికి ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక భరోసా…

హమార ప్రసాద్ ను చేయాలి – వెల్దండ ఎస్సై కి ఎమ్మార్పీఎస్ ఫిర్యాదు

వెల్దండ సెప్టెంబర్ 17:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పిత నాయకుడు అనే పుస్తకాన్ని ఈనెల 18న ఆవిష్కరిస్తానని అమర ప్రసాద్ ప్రకటించడం పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధారమైనటువంటి ఆరోపణలతో వస్తున్నటువంటి పుస్తక విడుదలను ఆపేసి వెంటనే అమర ప్రసాద్ ను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.ప్రపంచం మొత్తమే గర్వించదగ్గ మేధావి అంబేద్కర్ అని కొనియాడుతున్న వేళ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు సరికాదని హెచ్చరించారు.ఈ మేరకు నాగర్ కర్నూల్ జిల్లా…

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు భరోసా.. జీ. ఎస్. ఆర్

కల్వకుర్తి సెప్టెంబర్ 17 : కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం ఇస్రాయిపల్లి గ్రామానికి చెందిన రాచాలపల్లి స్వప్న కు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.25,000ల చెక్కును గురువారం కల్వకుర్తిలో వారి కుటుంబ సభ్యులు ముత్యాల నరేష్ కు అందజేశారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం…