Daily Archive: September 11, 2026

కాంగ్రెస్ తీరుపై చిరుమర్తి లింగయ్య ధ్వజం

కాంగ్రెస్ తీరుపై చిరుమర్తి లింగయ్య ధ్వజందళితులను రాజకీయ పావులుగా వాడుకుంటున్న రేవంత్ సర్కార్రూ.90 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు ఏమయ్యాయి..నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 10 : దళితులను రాజకీయ పావులుగా వాడుకుంటూ వారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దళిత సబ్‌ప్లాన్‌ కింద నిధులు కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. దళితుల కోసం కేటాయించిన రూ.90 వేల కోట్ల…

మంచినీటి సమస్యల తలెత్తకుండా చర్యలు : సర్పంచ్ ముక్కామల శ్యామల

మంచినీటి సమస్యల తలెత్తకుండా చర్యలు : సర్పంచ్ ముక్కామల శ్యామలజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 10 : మండల కేంద్రంలో ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు పకకుండా అన్ని చర్యలు తీసుకంటున్నామని సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని చెరువు కట్ట నుంచి కోటమైసమ్మ బజారు వరకు రూ.2.50లక్షల నిధులతో చేపట్టనున్న నూతన పైప్ లైన్ నిర్మాణానికి గురువారం ఆమె పాలకవర్గ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు…

అర్ధరాత్రి అరెస్టులతో విద్యార్థి నాయకులపై ఉక్కుపాదం – సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి: బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రవట్టి సాయిబాబా

బాన్సువాడ, సెప్టెంబర్ 11: ఎలాంటి పిలుపు, కార్యక్రమం లేకపోయినా బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులను పోలీసులు అర్ధరాత్రి నుంచి అరెస్టులు చేయడం దారుణమని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రబట్టి సాయిబాబా ఆరోపించారు. విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని విమర్శించారు.పోలీసులు అర్ధరాత్రి నుంచి విద్యార్థి నాయకుల ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేయడం వెనుక ప్రభుత్వ భయాందోళన స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎలాంటి ఆందోళనకు పిలుపు ఇవ్వకపోయినా అరెస్టులు చేయడం పోలీసుల ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని చాటుతోందని అన్నారు.విద్యార్థుల…

తర్నికల్ తండాలో ఉప్పల ట్రస్టు ఉదారత గాయపడిన యువకుడికి రూ.25 వేల ఆర్థిక సాయం

కల్వకుర్తి మండలం తర్నికల్ తండా గ్రామానికి చెందిన సిద్ధూ నాయక్ (19) జీపు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాలు విరిగి ఇంటికే పరిమితమయ్యాడు.విషయం తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ నేత ఉప్పల వెంకటేష్ ఆదేశాలతో ఆయన పెద్ద కుమారుడు డా. ఉప్పల అఖిల్ గురువారం తండాకు వెళ్లి పరామర్శించారు.ట్రస్ట్ తరఫున తక్షణ సహాయంగా రూ.25,000 ఆర్థిక సహాయం అందజేశారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా…

కన్నీటి వేళ.. అండగా నిలిచిన ఉప్పల ట్రస్ట్

కల్వకుర్తి 11: కల్వకుర్తి మండలంలోని తర్నికల్ తండా అంగొతి దాని నాయక్ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆదేశాల మేరకు ఆయన కుమారుడు డాక్టర్ ఉప్పల అఖిల్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సొమ్ల నాయక్,గుండ్య నాయక్, శ్రీనివాస్ నాయక్,దారమోని గణేష్, రుక్మొద్దిన్,సురేష్ గౌడ్,కృష్ణ,చంద్రయ్య,మాణిక్యం,దేవయ్య,శ్రీనివాసులు, పూరి రమేష్,యువకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదానికి గురైన యువకుడికి ఆర్థిక సహాయం:-

కల్వకుర్తి నియోజకవర్గం, కల్వకుర్తి మండలంలోని తర్నికల్ తండా సిద్ధూ నాయక్ గారు అనే యువకుడు ప్రమాదవశాత్తు గాయపడడం జరిగింది. ఈ విషయాన్ని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు & మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ గారి పెద్ద కుమారుడు డాక్టర్ ఉప్పల అఖిల్ గారు ప్రామర్శించి ప్రమాదానికి గురైన యువకుడికి వైద్య ఖర్చులకోసం ఆర్థిక సహాయం…

బొల్లంపల్లి పోచమ్మ ఆలయ గోపురం నిర్మాణానికి సర్పంచ్ ప్రసాద్ గౌడ్ విరాళం

కల్వకుర్తి సెప్టెంబర్ 11: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామంలోని పోచమ్మ ఆలయ నిర్మాణ అభివృద్ధి పనులకు గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ తన వంతు సహకారం అందించారు.ఆలయ నిర్మాణ పనులలో భాగంగా గోపుర నిర్మాణమునకు శుక్రవారం గోపుర నిర్మాణ శిల్పికి రూ.20,000 రూపాయలు విరాళంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకటరెడ్డి,ఉప సర్పంచ్ రామకృష్ణ,నాయకులు కానుగుల పర్వతాలు, రమేష్, యాదయ్య, బ్రహ్మచారి, అలంపల్లి కృష్ణ, శ్రీనివాస్ చారి, మాజీ వార్డు సభ్యులు పర్వతాలు,బూర్గు లింగం యాదవ్,…

కంటి వెలుగులో ప్రజాసేవ – సింగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 6వ కంటి వైద్య శిబిరం

కడ్తాల్, సెప్టెంబర్ 11: కడ్తాల మండలంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో 6వ ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్య, వైద్య, ఉపాధి రంగాలలో ఎంతోమందికి సేవ చేసే భాగ్యం దక్కిందని అన్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానమని, కంటి వైద్య శిబిరాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు…

ప్రజా ఆరోగ్యమే ప్రథమ లక్ష్యం – సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కడ్తాల్, సెప్టెంబర్ 11: ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కడ్తాల్ ఎంబీఏ గార్డెన్ లో 6వ మెగా ఉచిత కంటి శిబిరం ప్రారంభమైంది. మొదటి రోజు 600 మందికి పైగా హాజరుకాగా 350 మందికి పరీక్షలు, 180 మందికి అద్దాలు, 30 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు.ఐదు మండలాల్లో 19,200 మందికి పరీక్షలు, 722 మందికి ఆపరేషన్లు, 13,075 మందికి అద్దాలు ఇచ్చామని రాఘవేందర్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 11-16 వరకు పరీక్షలు,…

కట్టంగూర్ ఎంఈఓగా మైనం శ్రీలత బాధ్యతల స్వీకరణ

కట్టంగూర్ ఎంఈఓగా మైనం శ్రీలత బాధ్యతల స్వీకరణజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 11: మండల నూతన విద్యాధికారిగా మైనం శ్రీలత శుక్రవారం ఎంఆర్సీ భవనంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎంఈఓగా విధులు నిర్వహించిన అంబటి అంజయ్య వ్యక్తిగత కారణాలతో బాధ్యతల నుంచి తప్పుకోవడంతో, ఆయన స్థానంలో పామనగుండ్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మైనం శ్రీలతను ఎంఈఓగా నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన శ్రీలత మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ…