వేరు శనగ విత్తనాల పంపిణీ రైతులు వినియోగించు కోవాలి


జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 12 : ఆమనగల్ మండలంలోని రైతు వేదికలో రైతు వేదిక ఏ ఈ ప్రభావతికి పోలేపల్లి గ్రామం తరపున పోలేపల్లి సర్పంచ్ జంతుక వెంకటయ్య అందజేశారు.రైతులకు ప్రభుత్వం ఇచ్చే తల్లి వేరుశనగ విత్తనాల గురించి పాస్ బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ మట్టి నమూనా ఇవ్వడం జరిగింది వచ్చేనెల చివరి వరకు రైతులకు వేరుశనగ విత్తనాలు అందుబాటులోకి తేవాలని ఏఈని కోరడం జరిగింది. వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్ వచ్చే నెల 20 తారీకు లోగా రైతులకు వేరుశనగ విత్తనాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు .పోలేపల్లి గ్రామానికి 35 మంది రైతులకు వేరుశనగ విత్తనాలు అందిస్తామని శ్రీనివాస్ గౌడ్ ఏఈ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ చిన్న జంగయ్య సామాజిక సంఘ సేవకులు కాసోజు సురేష్ పాల్గొనడం జరిగింది.పోలేపల్లి సర్పంచ్ వెంకటయ్య

You may also like...