వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం

వెల్దండ మండల పరిధిలోని బర్కత్ పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు.ఆదివారం వెల్దండ మండల మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి పోతేపల్లి సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాలతో అభినందించి  సత్కరించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

You may also like...