Category: తాజా వార్తలు

మోడీ మాస్టర్‌స్ట్రోక్‌ అంటూ వ్యంగ్యం

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వ్యంగ్య పోస్టులో పాకిస్థాన్‌ “డయాబెటిస్‌ జిహాద్‌” పేరుతో చక్కెరను చౌకగా చేసి ప్రజల్లో మధుమేహం పెంచాలని కుట్ర పన్నిందంటూ పేర్కొన్నారు. దీనిని అజిత్‌ డోవల్‌ ముందుగానే గుర్తించి “ఆపరేషన్‌ స్వీట్‌ పాయిజన్‌” చేపట్టారని సెటైరికల్‌గా వివరించారు. చక్కెరను ఇథనాల్‌ తయారీకి...

చేవెళ్ల బస్‌స్టాండ్‌లో మరో ప్రమాదం

చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని బస్‌స్టాండ్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కారణంగా మల్కాపూర్‌ వార్డుకు చెందిన జబర్‌ అనే వ్యక్తి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. బస్‌స్టాండ్‌లో బస్సుల రాకపోకల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో జబర్‌కు గాయాలైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు...


శంకర్‌పల్లి మండలంలో నిన్న ప్రజావాణి నిర్వహించారా?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమం శంకర్‌పల్లి మండలంలో అసలు నిర్వహించారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగిందా లేదా అనే విషయం కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి నెలకొంది. కార్యక్రమం జరిగి ఉంటే...

NEHS మార్గదర్శకాలు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ (EHCT) ఆధ్వర్యంలో నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (New Employees Health Scheme–NEHS) అమలుకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ప్రభుత్వ సేవల్లో నూతనంగా చేరే ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన వైద్య...

హరీశ్‌రావుకు గౌడి చర్ల వారి వివాహ ఆహ్వానం

రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని జన్వాడ మాజీ సర్పంచ్ గౌడి చర్ల లలిత నరసింహ తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహానికి సంబంధించిన వివరాలను తెలియజేసి, కుటుంబ...

గచ్చిబౌలి స్టేడియంలో యువ శౌర్య సేనకు హై రేంజ్ వరల్డ్ రికార్డు సాధించిన సింగప్పగూడెం విజ్ఞాన్ సాయి

గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో సింగప్పగూడెం విజ్ఞాన్ సాయి కి యువ శౌర్య సేన అత్యున్నత స్థాయి ప్రదర్శనతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.ఈ ఘన విజయానికి కృషి చేసిన యువ శౌర్య సేన సభ్యులను అభినందిస్తూ, వారి ప్రతిభను తీర్చిదిద్దిన మాస్టర్ రవీందర్ యాదవ్...

గౌడిచర్ల వారి వివాహ ఆహ్వానం

రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని జన్వాడ మాజీ సర్పంచ్ గౌడిచర్ల లలిత నరసింహ తన కుమార్తె వివాహానికి ప్రముఖులను ఆహ్వానించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు బీర్ల ఐలయ్యలను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు....

మొయినాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పర్వేద వార్డు మెంబర్ రవి

శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పర్వదినం సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య కుమారుడు, మొయినాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్వేద గ్రామ వార్డు మెంబర్ రవీందర్ హాజరై కాలే శ్రీకాంత్‌కు పూలగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి...

ప్రముఖ నటి షావుకారు జానకి (94) కన్నుమూత

దక్షిణాది చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను ఇటీవల కావేరి ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం 1:59 గంటలకు తుదిశ్వాస విడిచారు.షావుకారు...

మొహీనాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శంకర్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి

శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య కుమారుడు, మొహీనాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్ జన్మదిన వేడుకలు చేవెళ్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బొల్లారం వెంకట్‌రెడ్డి,...