అర్ధరాత్రి బైక్లకు భగ్గుమన్న మంటలు
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్షాకోట్ డివిజన్ సాయిరాంనగర్ కాలనీలో అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఇంటి ప్రాంగణంలో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో క్షణాల్లోనే పరిస్థితి భయానకంగా మారింది. పెట్రోల్ ఉండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి ఐదు...
