చెర్కూర్ ప్రాథమిక పాఠశాలకు కుర్చీల వితరణ

వెల్దండ ఆగస్టు 31: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు కుర్చీలను సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు  సలహా మేరకు  అదే గ్రామంలో చెందిన రైతు మండేగుత్తల శశిధర్  అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం దాతకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు మైసయ్య,భీమయ్య గౌడ్, అల్లె సందీప్, చంద్రమౌళి రామచంద్రయ్య పాఠశాల ఉపాధ్యాయురాలు, లింగయ్య వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like...