భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రించిన భార్య

ఆంధ్రప్రదేశ్ : మదనపల్లె జిల్లా పీలేరులో ఓ దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య ఉమాదేవి, తన ప్రియుడు చారా సుబ్రహ్మణ్యం కలిసి భర్త వెంకట సుబ్రహ్మణ్యంను హత్య చేసింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి మత్తులోకి జారుకున్న తర్వాత ప్రియుడితో కలిసి హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు.మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు, విచారణలో అసలు నిజాన్ని బయటపెట్టి, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు

You may also like...