Monthly Archive: August 2026

చిన్నారుల గుండె శస్త్రచికిత్సలకు ఉచిత వైద్యం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులకు నిమ్స్ ఆస్పత్రి శుభవార్త అందించింది. ఆర్థిక స్థోమత లేక గుండె శస్త్రచికిత్సలు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అండగా నిలిచేలా ఈ నెల 13వ తేదీ నుంచి చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ ఆస్పత్రి ప్రకటించింది....

పాలమూరు ఆశలపై కేంద్రం నీళ్లు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ప్రతినిధి : తెలంగాణలో అత్యంత కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్రం రాజ్యసభలో స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం...

కృష్ణమ్మ సాక్షిగా జలయజ్ఞం.. వరుణుడికి ఆహ్వానం

జ్ఞానతెలంగాణ,నాగార్జునసాగర్ ప్రతినిధి : తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహా వరుణ యాగం పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. కృష్ణా నది తీరాన నాగార్జునసాగర్ ప్రాజెక్టు...

పొంగులేటి–కౌశిక్ రెడ్డి వార్.. వేడెక్కిన వేదిక

జ్ఞానతెలంగాణ,హుజురాబాద్ ప్రత్యేక ప్రతినిధి : వేదిక ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడంలో వెనుకాడని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అధికారిక కార్యక్రమమా.. రాజకీయ వేదికా అనే పరిస్థితి నెలకొనేలా మంత్రి...

మృతుడి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక సహాయం

జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి,ఆగస్టు 10: వెల్దండ మండలం అజాలాపురం గ్రామానికి చెందిన జానీ మియా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. ఉదారత చాటుతూ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్...

మోదీతో సీడబ్ల్యూజీ విజేతల భేటీ

కామన్వెల్త్‌ గేమ్స్‌–2026లో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం సీడబ్ల్యూజీ పతక విజేతలతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రధాని.. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పతకాలు సాధించేందుకు వారు చేసిన కృషి, పట్టుదల, అంకితభావాన్ని ప్రశంసించారు. క్రీడాకారుల...

విద్యార్థులపై దాడిపై అమిత్‌ షా మౌనం ఎందుకు?

జ్ఞానతెలంగాణ,సెంట్రల్ డెస్క్ :నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసుల దాడి ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించకపోవడాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఘటనపై అమిత్‌ షా ఏదో ఒకరోజు సమాధానం చెప్పక తప్పదని అన్నారు....

క్లీన్‌ ఎనర్జీపై భట్టి కీలక చర్చలు

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీలోని గోల్డ్‌మన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీలో ఉన్న ఇండియా ఎనర్జీ అండ్‌ క్లైమేట్‌ సెంటర్‌ (IECC)ను సందర్శించారు. ఈ సందర్భంగా భారత్‌ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు,...

బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే మాణిక్‌రావు

జ్ఞాన తెలంగాణ, జహీరాబాద్‌ ప్రతినిధి | ఆగస్టు 09: ఝరాసంఘం మండల కేంద్రంతో పాటు గంగాపూర్‌, జహీరాబాద్‌ మండలం అల్గోల్‌ గ్రామాల్లో బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, జహీరాబాద్‌ మండల పార్టీ...