ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ చెప్పినశంకర్ పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేష్
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :
శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నూతన గృహాలను నిర్మిస్తున్న లబ్ధిదారులు ఇసుక విషయంలో ఇబ్బంది పడవద్దని.ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టోకెన్ ద్వారా ఉచితంగా ఇసుకను సరఫరా చేయడం జరుగుతుందని శంకర్పల్లి మున్సిపాలిటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇసుక కావలసిన లబ్ధిదారులు తమకు అర్జీ పెట్టుకోవాలని సూచించారు.అర్జీని పరిశీలన చేసి టోకన్స్ ద్వారా ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు.