గణేష్ ఉత్సవ కమిటీకి ఆర్థిక సహాయం

వెల్దండ: మండలంలోని చౌదర్ పల్లి గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీకి సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రావు రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు.వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామ యువకులు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలుస్తూ భాస్కర్ రావు ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. డీజే సౌండ్ బాక్సుల ఏర్పాటుకు, ఇతర ఏర్పాట్లకు ఈ నగదును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ యువకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1001331808.jpg

గణేష్ ఉత్సవ కమిటీకి ఆర్థిక సహాయం

You may also like...