సామాజిక కార్యకర్త, ఆశిగల్ల నగేష్ బాబు ఇక లేరు.
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష - August 31, 2026
- రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి - August 31, 2026
- ఓబీసీ సెల్ నూతన కమిటీలకు దరఖాస్తుల ఆహ్వానం - August 31, 2026

జై భీమ్….,సాధిద్దాం.., అంబేద్కర్ ఆశయాలను, సాధిద్దాం, సాధిద్దాం…, అంటూ.., నినదించే గొంతుక మూగబోయింది,
సామాజిక కార్యకర్త, ఆశిగల్ల నగేష్ బాబు ఇక లేరు.
గత వారం రోజులుగా, అనారోగ్యంతో బాధపడుతూ… మృత్యుతో పోరాడివోడిన పొద్దుటూరు నగేష్ బాబు, ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. జ్ఞాన తెలంగాణ( శంకర్ పల్లి ) సోషల్ యాక్టివిస్ట్, మరియు బాల కార్మిక నిర్మూలన కొరకు, మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ లో, విశేష సేవలు అందించిన ఆశిగల్ల నగేష్ బాబు, గత వారం రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. నేడు ఉదయం ఐదు గంటలకు, నగరంలోని నిమ్స్ హాస్పటల్లో, మృత్యువుతో పోరాడి, తుది శ్వాస విడిచారు, ఈ సందర్భంగా పొద్దుటూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి, పొద్దుటూరు అంబేద్కర్, వారసులందరూ,భారీ.. ఎత్తున, నగరంలోని నిమ్స్ హాస్పత్రికి చేరుకున్నారు.
