శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టాపనలో పాల్గొన్న.. సుంకిరెడ్డి

వెల్దండ మండలం బర్కత్‌పల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరై అమ్మవారి ప్రతిష్టాపన అనంతరం శ్రీ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని పూజ కార్యక్రమంలో పాల్గొని,తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని,గ్రామంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.అనంతరం సుంకిరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ అమ్మవారి ఆశీస్సులతో గొప్ప స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పర్వతాలు,ఉప సర్పంచ్ నరసింహ,సీనియర్ నాయకులు బొజ్జయ్య, అల్లాజీ,కొండల్, లింగం,మల్లేష్,శ్రీశైలం,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు రాజు, జంగయ్య,కొండల్ యాదవ్,చంద్ర శేఖర్ ఆలయ నిర్వాహకులు,గ్రామ పెద్దలు,యువత,తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like...