22-ఏ భూములపై సమగ్ర విచారణ చేపట్టాలి కలెక్టర్ కు వినతి పత్రం

22-ఏ భూములపై సమగ్ర విచారణ చేపట్టాలి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు

తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి నూక కిరణ్ కుమార్ యాదవ్ మరియు డిసిసి అధ్యక్షురాలు లకావత్ ధనవంతి లక్ష్మీనారాయణ నాయక్

జనగామ, సెప్టెంబర్ 18: జిల్లాలోని 22-ఏ భూములు, ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ చేపట్టాలని టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. భూముల రికార్డులు, రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లను పూర్తిగా పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ భూములు, ఆస్తుల రికార్డులను పారదర్శకంగా పరిశీలించి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన కలెక్టర్ ను కోరారు

You may also like...