చౌదర్ పల్లి గణేష్ ఉత్సవాలకు సింగిల్ విండో చైర్మన్ రూ.25 వేల విరాళం

1001190542.jpg

వెల్దండ, సెప్టెంబర్ 18: వెల్దండ మండలం చౌదర్‌పల్లిలో గణేష్ ఉత్సవ కమిటీకి వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు రూ.25 వేల విరాళాన్ని అందజేశారు. గణేష్ మండపంలో మైక్ సెట్ ఏర్పాటు కోసం ఈ విరాళాన్ని అందించినట్లు ఆయన తెలిపారు.అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భాస్కరరావు పేర్కొన్నారు. సమాజ మనుగడకు భక్తి, భావనలే ఆధారమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దొబ్బల రాజీవ్, వార్డు సభ్యులు భరత్,నరేష్,వంశీ గణేష్, మహేష్ , రాజేష్ లతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...