రుద్రారంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన కాలే యాదయ్య
- ఆదివాసి గిరిజన బిడ్డ శిరీష కుటుంబానికి న్యాయం జరగాలి - August 31, 2026
- చెల్లి.. బుజ్జి అంటూ వివాహితతో కానిస్టేబుల్ రాసలీలలు! - August 31, 2026
- 21 ఏళ్ల తర్వాత.. ‘నా కొడుకు తండ్రివి నువ్వే’ అంటూ ధర్నా - August 31, 2026

షాబాద్: చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం రుద్రారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను అభినందించారు. అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా ఇంటి ప్రారంభోత్సవం జరగడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

