వెల్దండలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
- మృతుడి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక సహాయం - August 10, 2026
- మోదీతో సీడబ్ల్యూజీ విజేతల భేటీ - August 9, 2026
- విద్యార్థులపై దాడిపై అమిత్ షా మౌనం ఎందుకు? - August 9, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 09: వెల్దండ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆభయారవ ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి మోతిలాల్, మండల పార్టీ అధ్యక్షులు హరికిషన్ నాయక్ ల ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ జిందాబాద్ రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ, చేసిన నినాదాలతో చేస్తూ రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
