బీజేపీ నేత తొండ రవికి పితృవియోగం


జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:
బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తొండ రవి తండ్రి తొండ శేఖయ్య పరమపదించిన విషయం అత్యంత విచారకరం. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తొండ శేఖయ్య అంత్యక్రియలు ఆగస్టు 6న ఉదయం 11:00 గంటలకు స్వగ్రామం గోపులారంలో నిర్వహించనున్నారు. బంధుమిత్రులు, అభిమానులు అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించాలని కుటుంబ సభ్యులు కోరారు.

You may also like...