Category: జిల్లా వార్తలు

హైవే పక్కన వాహనాల నిలిపివేత మృత్యుశకటాలుగా మారుతున్న రహదారులు అక్రమ పార్కింగ్‌తో ప్రాణాలకు ముప్పు

రోడ్డు పక్కన ఆపిన వాహనమే ప్రాణం తీస్తే.. ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి…కట్టంగూర్: హైదరాబాద్‌–విజయవాడ 65వ జాతీయ రహదారిపై అక్రమ పార్కింగ్‌ వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. కట్టంగూర్‌ మండల పరిధిలోని అయిటిపాముల నుంచి పామనుగుండ్ల వరకు హైవే పక్కన భారీ లారీలు, కంటైనర్లు, ఇతర వాహనాలను ఇష్టారాజ్యంగా నిలిపివేస్తున్నారు. ముఖ్యంగా దాబాలు, హోటళ్ల వద్ద రోడ్డుపైనే వాహనాలను నిలిపి డ్రైవర్లు విశ్రాంతి తీసుకుంటుండటంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉంది.

పిల్లల సృజనాత్మకత శారీరక ఎదుగుదలపై అవగాహన

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 29: కల్వకుర్తి మండలం లోని రాచాలపల్లి గ్రామంలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం వర్క్‌షాప్, అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో 1, 2వ తరగతుల విద్యార్థులు, వారి తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు జ్ఞానాన్ని పెంపొందించడం, తల్లులు పిల్లలతో అనుబంధాన్ని పెంచుకోవడం, డ్రాయింగ్ వంటి సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. 

రామేశ్వరం పల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

రామేశ్వరం పల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్గారు.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరు – భిక్కనూర్‌లో ఏర్పాటు చేస్తున్నాం: షబ్బీర్ అలీ

మెరుగైన బోధనకు కాంప్లెక్స్ సమావేశాలు దోహదం : పాఠశాల విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎం. సోమిరెడ్డి

విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన బోధన అందించడంలో కాంప్లెక్స్ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయని పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఎం. సోమిరెడ్డి అన్నారు. శనివారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఇంగ్లీష్ కాంప్లెక్స్ సమావేశాన్ని ఆయన సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. వివిధ పాఠశాలల్లో అమలు చేస్తున్న వినూత్న బోధనా పద్ధతులను పరస్పరం పంచుకోవడం ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరచవచ్చన్నారు.

రాష్ట్రపతి భవన్ రాఖీ వేడుకల్లో పాల్గొన్న ఏకలవ్య విద్యార్థి

రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఎ. వైష్ణవి పాల్గొన్నారు.భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించడం పాఠశాలకు ఎంతో గర్వకారణమని ప్రిన్సిపాల్ సుమన్ కుమార్ తెలిపారు.

ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌పై ఎంఐఎం వేటు

ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు పార్టీ జాయింట్‌ సెక్రటరీ ఎస్‌ఏ హుస్సేన్‌ అన్వర్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా తన ఎమ్మెల్సీ పదవికి కూడా వెంటనే రాజీనామా చేసి, ఆ రాజీనామా...

డిండి ఎత్తిపోతల పథకం అంశంపై సమీక్ష సమావేశం

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 27: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులతో అత్యవసర సమీక్షా సమావేశం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించబడింది.ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని చారగొండ మండలం పరిధిలోని గోకారం గ్రామ రైతుల భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో పాటు,ఎర్రవల్లి గ్రామపంచాయతీ మరియు...

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

షాద్‌నగర్ నెహ్రూ కాలనీకి చెందిన జమాల్పూర్ నవీన్ (24) బుధవారం ఉదయం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు.చట్టాన్‌పల్లి రైల్వే గేట్ సమీపంలోని మటన్ షాపులో విద్యుత్ వైరు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి నవీన్ కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి...

పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ భరోసా.. ఎమ్మెల్యే కసిరెడ్డి

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 25: పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ భరోసాగా ఉంటుందని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నివాసంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేద ప్రజల ఆరోగ్యమే తమ ప్రభుత్వ లక్ష్యమని,...

డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై చేవెళ్లలో రేపు కీలక సమావేశం

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (DCC) నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కర్ణాటక ఎమ్మెల్సీ, AICC కార్యదర్శి శ్రీ పి.వి. మోహన్‌ అబ్జర్వర్‌గా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను...