Category: జిల్లా వార్తలు

రుద్రారంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన కాలే యాదయ్య

షాబాద్‌: చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌ మండలం రుద్రారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను అభినందించారు. అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సొంతింటి కలను సాకారం చేయడమే...

మన నేచురల్ డైరీ ప్రారంభించిన చేవెళ్ల మున్సిపాలిటీ చైర్మన్

చేవెళ్ల మున్సిపాలిటీ, ఆగస్టు 31: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని చేవెళ్ల విలేజ్‌ రోడ్డులో, పోస్ట్‌ ఆఫీస్‌ పక్కన మన నేచురల్‌ డైరీ నూతన షాప్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ దేవర సమత వెంకట్‌...

మాడల్‌ స్కూళ్లకు గ్రహణం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌: ఇంగ్లిష్‌ మీడియంలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ మాడల్‌ స్కూళ్ల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. పేరుకు ‘మాడల్‌’ స్కూళ్లుగా ఉన్నా.. ఆచరణలో మాత్రం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా భారీగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి....

అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

షాద్‌నగర్‌: రంగారెడ్డి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హత కలిగిన స్థానిక మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్‌ అధికారులు సూచించారు. ఈ మేరకు సోమవారం...

సీడ్‌ గణేశుడినే పూజించండి: చిరంజీవి పిలుపు

పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా మలచాలని మెగాస్టార్‌ చిరంజీవి పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలకు స్వస్తి పలికి, మట్టి వినాయకులతో పాటు సీడ్‌ గణేశుడిని పూజించే సంప్రదాయాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. పండుగ భక్తికి...

చదువు ఒత్తిడితో విద్యార్థి బలవన్మరణం

మియాపూర్‌: మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సుభాష్‌ చంద్రబోస్‌ నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో 16 ఏళ్ల పదో తరగతి విద్యార్థి మల్లికార్జున్‌ బలవన్మరణానికి పాల్పడిన ఘటన కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. చిన్న...

అర్ధరాత్రి బైక్‌లకు భగ్గుమన్న మంటలు

రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌షాకోట్ డివిజన్ సాయిరాంనగర్ కాలనీలో అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఇంటి ప్రాంగణంలో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో క్షణాల్లోనే పరిస్థితి భయానకంగా మారింది. పెట్రోల్ ఉండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి ఐదు...

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన (pmjjby)

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన (pmjjby) ఇన్స్యూరెన్స్ ద్వారా సాలిమెడ శ్రీనివాస్ గారు మరణించినందున వారి భార్య ఉజ్జీవ గారికి 2 లక్షల రూపాయల ఇన్స్యూరెన్స్ బీబీపేట యూనియన్ బ్యాంకు మేనేజర్ గారు హర్షద్ అలీ గారు, సబ్ మేనేజర్ కృష్ణప్రసాద్ , ఫీల్డ్ ఆఫీసర్ మనోజ్ , యశ్వంత్ , ఆనంద్ , జనగామ  బ్యాంకింగ్ కరస్పాండెంట్ లలిత లింగం , ఇతర బ్యాంకు సిబ్బంది కలసి cheque అందచేయటం జరిగింది.

వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం

వెల్దండ మండల పరిధిలోని బర్కత్ పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు.ఆదివారం వెల్దండ మండల మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి పోతేపల్లి సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాలతో అభినందించి  సత్కరించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

కల్వకుర్తిలో 2 కే రన్ పోటీలు ప్రారంభిచిన ఎమ్మెల్యే కసిరెడ్డి

* నాగర్‌ కర్నూల్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో బాలురు, బాలికల కోసం మొదటి 2కే రన్ క్రీడా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి హాజరై, 2కే రన్ క్రీడా పోటీలను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా చిన్నారులు, యువ క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.అనంతరం పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే  బహుమతులు అందజేసి అభినందించారు.గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని  సూచించారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, కల్వకుర్తి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం,కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్,పట్టణ మరియు మండల స్థాయి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు,క్రీడా సంఘం నిర్వాహకులు, కార్యకర్తలు, అభిమానులు, క్రీడాకారులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.