రాచూరులో సహజ వ్యవసాయంపై అవగాహన సదస్సు
- మానవత్వం చాటుకున్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - September 16, 2026
- కంటోన్ పల్లి లో చేయూత పింఛన్ల ఆకస్మిక తనిఖీలు – రాష్ట్ర బృందం పరిశీలన - September 15, 2026
- శ్రీరాములు కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ అధినేత ఆర్థిక సహాయం - September 15, 2026

వెల్దండ : మండలంలోని రాచూరు గ్రామ రైతువేదికలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి శోభారాణి ఆధ్వర్యంలో సహజ వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రసాయన ఎరువులు తగ్గించి జీవామృతం, బీజామృతం, ఘన జీవామృతం తయారీపై వ్యవసాయ అధికారులు రైతులకు శిక్షణ ఇచ్చారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని, నేల ఆరోగ్యం మెరుగవుతుందని సూచించారు.
