Category: జిల్లా వార్తలు

మృతురాలి కుటుంబానికి భాస్కరరావు ఆర్థిక సహాయం

కల్వకుర్తి సెప్టెంబర్ 06:చారకొండ మండలంలోని గోకారం గ్రామానికిచెందిన పంజుగుల రాములమ్మ ఇటీవల ఆకస్మికంగా మరణించారు.వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు మృతుని కుటుంబానికి భాస్కర్ రావు యువసేన సభ్యుల ద్వారా రూ.5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పంజుగుల పరుశరాములు,కొండల్,రషీద్,గజ్జెశ్రీను, వెంకటయ్య,శ్రీను,రవి,అల్లాజీ మహేష్,కరుణాకర్,వెంకటరెడ్డి,లక్ష్మారెడ్డిసాదిక్ అలీ మల్లయ్య, జూపల్లిభాస్కర్ రావు యువసేన అధ్యక్షుడు ఎండి సిరాజ్,జూపల్లి భాస్కర్ రావుయువసేన సభ్యులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి‌‌.. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కల్వకుర్తి సెప్టెంబర్ 06:యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని ఐక్యత పౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి సీసీటీ కెమెరా సొల్యూషన్స్ కమ్యూనికేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతనంగా వ్యాపార, ఉద్యోగాల కోసం ఎదురుచూడటంతో పాటు,స్వయం ఉపాధిని ఎంచుకుని మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి యువత ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆర్.పి.ఎం సిసి టీవీ కెమెరా సొల్యూషన్స్,నిర్వాహకులు రమేష్ & చాయ్ దోస్తీ టీ…

డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలి

డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలి : మండల వ్యవసాయ అధికారి వై.గిరిప్రసాద్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 6 : డిజిటల్ సర్వేకు రైతులు సహకరించాలని మండల వ్యవసాయ అధికారి వై.గిరి ప్రసాద్ అన్నారు. ఆదివారం మండలంలోని ఈదులూరు గ్రామంలో పత్తి పంటలను పరిశీలించి డిజిటల్ క్రాప్ సర్వేపై రైతులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పత్తి పంటలో బెట్ట వాతావరణ పరిస్థితులను తట్టుకనేందుకు లీటర్ నీటికి 2 శాతం యూరియా ద్రావణం లేదా 19.19.19, 13.0.45…

ప్రాణాపాయంలో ఉన్న వానరానికి మానవత్వంతో ప్రథమ చికిత్స

ప్రాణాపాయంలో ఉన్న వానరానికి మానవత్వంతో ప్రథమ చికిత్స

ప్రాణాపాయంలో ఉన్న వానరానికి మానవత్వంతో ప్రథమ చికిత్సజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 6 : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వానరానికి ఓ గోపాలమిత్రుడు మానవత్వంతో అండగా నిలిచారు. కట్టంగూర్ మండలం‌ అయిటిపాముల గ్రామ పరిధిలోని చెర్వుఅన్నారం అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం డీసీఎం వాహనం ఢీకొనడంతో ఓ వానరం తీవ్రంగా గాయపడింది. కదలలేని స్థితిలో రోడ్డుపక్కన పడి ఉన్న వానరాన్ని చూసిన వారు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో అటుగా…

ఆలయ అభివృద్ధికి సుంకిరెడ్డి రూ. లక్ష 70 వేల విరాళం

ఆలయ అభివృద్ధికి సుంకిరెడ్డి రూ. లక్ష 70 వేల విరాళం

కల్వకుర్తి సెప్టెంబర్ 06: తలకొండపల్లి మండలం చుక్కపూర్ ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,టాస్క్ సి.ఓ.ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పన కోసం రూ.1లక్ష డెబ్భై వేల రూపాయల చెక్కును ఆలయ నిర్వాహకులు వెంకటేశ్వర శర్మకు అందజేశారు.అనంతరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు.గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కర్రోలి దశరథం…

బల్మూర్ మండలంలో బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్.!

బల్మూర్ సెప్టెంబర్ 06: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని బల్మూర్ మండల కేంద్రంలో సోమవారం శాంతియుతంగా ధర్నాకు సిద్ధమవుతున్న బీజేపీ మరియు బీజేవైఎం ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.ప్రభుత్వ నిరంకుశ వైఖరికి, పోలీసుల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతుంటే అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. అరెస్టయిన ముఖ్య నాయకులలో బాలస్వామి యాదవ్, బల్మూర్ మండల బీజేపీ అధ్యక్షులు…

అడుగడుగునా గుంతలు.. రాకపోకలకు అవస్థలు.. 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డుకు మరమ్మతులు కరువు శిథిలమైన కురుమర్తి రోడ్డు…

అడుగడుగునా గుంతలు.. రాకపోకలకు అవస్థలు..20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డుకు మరమ్మతులు కరువుశిథిలమైన కురుమర్తి రోడ్డు…జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 06: కట్టంగూర్ నుంచి కురుమర్తి కి వెళ్లే రోడ్డు ద్వంసం కావడంతో వాహనదారులు ఇక్కట్లు వడుతున్నారు. 8 కిలో మీటర్ల మేర అడుగడుగునా గుంతలు పడి అధ్వానంగా మారింది. దీంతో ఈరోడ్డుపై వెళ్లాలంటే వాహనదారులు జంకుతున్నారు. రాత్రిపూట అయితే నరకం చూడాల్సిందే అని భయాందోళన చెందుతున్నారు. సుమారు 20 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన్ కింద కట్టంగూర్ నుంచి కురుమర్తికి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డు ద్వంసం కావడంతో ఓ సారి తూతూ మంత్రంగా మరమ్మత్తులు చేపట్టి చేతులుదుపుకున్నారు. రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో మండలంలోని గార్లబాయిగూడెం, తేలువారిగూడెం గ్రామాలతో పాటు శాలిగౌరారం మండలం ఆకారం, వల్లాల, గురజాల గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం కురమర్తి గ్రామం మీదుగా కట్టంగూర్ కూ రాకపోకలు సాగించాలంటే జంకుతున్నారు. పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో రెండువాహనాలు ఎదురెదురుగా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. సత్యనారాయణపురం, కురుమర్తి శివారులో రోడ్డు మద్యలో గోతులు పడడంతో అందులో పడి ఎంతో మంది ద్విచక్రవాహనదారులకు గాయాలయ్యాయి. రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని పలుమార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని ఆయా గ్రామాల ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.  పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేయాలి : బీరెల్లి రామచంద్రయ్య మాజీ ప్రజాప్రతినిధుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులునిత్యం రద్దీగా ఉంటే కట్టంగూర్ నుంచి కురుమర్తికి వెళ్లే రోడ్డును పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలి. గత 20 సంవత్సరాల క్రితం నిర్మించి రోడ్డు వర్షాలకు ద్వంసం అయి రోడ్డుపై గుంతలు పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. గత ఐదు సంవత్సరాల నుంది వాహనదారులు రోడ్డు పై ప్రయాణించాలంటే భయాంతోళన చెందుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందించి కట్టంగూర్, శాలిగౌరారం మండల ప్రజల నిత్యం రాకపోకలు సాగించే ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలి

కాంగ్రెస్ బాకీ తీర్చాలంటూ బిఆర్ఎస్ వినూత్న నిరసన

.కాంగ్రెస్ చేతిలో మోసపోయిన తెలంగాణ.. పుట్ట రాంరెడ్డి వెల్దండ సెప్టెంబర్ 06:కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను తీర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి అన్నారు.బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పిలుపుమేరకు మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్, మండల పార్టీ మాజీ అధ్యక్షులు కానుగుల జోగయ్యలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు అధిక…

ఐక్యత పౌండేషన్ ఆధ్వర్యంలో నీటి ట్యాంక్ శుద్ధి

వెల్డండ సెప్టెంబర్ 05: వెల్దండ మండలంలోని కుందారం తండా గ్రామంలో నిర్వహించి త్రాగునీటి నిల్వ ట్యాంకులను స్వచ్ఛ ద్వారా కార్యక్రమంలో భాగంగా శనివారం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో జర్మన్ సాంకేతికతతో కూడిన ప్రత్యేక యంత్రాల సహాయంతో శుద్ధి చేయించడం జరిగింది. కార్యక్రమంలో కుందారం తండా గ్రామ సర్పంచ్ గన్య నాయక్, గ్రామ డిప్యూటీ సర్పంచ్ అనిత జంగు ,మరియు వార్డు సభ్యులు ,గ్రామ నాయకులు , యువకులు తదితరులు…

వైద్య విద్యార్థిని సన్మానించిన సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

కల్వకుర్తి సెప్టెంబర్ 05 వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి శేఖర్ గుద్దేటి అలివేల దంపతుల కూతురు గుద్దేటి సరిత నీట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనభర్చి నీట్ కామారెడ్డి ప్రభుత్వ మెడికల్సీ సీటు సాధించిన విద్యార్థిని పాటు తల్లిని గ్రామపంచాయతీ ఆవరణంలో శాలువలతో సన్మానించారు.ఉన్నంత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..గుద్దేటి సరితను ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి లక్ష్యంతో కష్టపడి చదివితే ఉన్నత విజయాలు సాధించవచ్చు అని అన్నారు. అనంతరం విద్యార్థి ఖర్చులకు…