రాంనగర్ కాలనీ గణనాధుని దర్శించుకున్న జోగయ్య
- మానవత్వం చాటుకున్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - September 16, 2026
- కంటోన్ పల్లి లో చేయూత పింఛన్ల ఆకస్మిక తనిఖీలు – రాష్ట్ర బృందం పరిశీలన - September 15, 2026
- శ్రీరాములు కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ అధినేత ఆర్థిక సహాయం - September 15, 2026

వెల్దండ: వెల్దండ మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కొలువుదీరిన విఘ్నేశ్వరుని బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట స్థానిక యువత, బీఆర్ఎస్ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఉత్సవ కమిటీ సభ్యులు కానుగుల జోగయ్యను శాలువాతో సన్మానించారు.
