Category: నాగర్‌కర్నూల్

యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి‌‌.. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కల్వకుర్తి సెప్టెంబర్ 06:యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని ఐక్యత పౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి సీసీటీ కెమెరా సొల్యూషన్స్ కమ్యూనికేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతనంగా వ్యాపార, ఉద్యోగాల కోసం ఎదురుచూడటంతో పాటు,స్వయం ఉపాధిని ఎంచుకుని మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి యువత ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆర్.పి.ఎం సిసి టీవీ కెమెరా సొల్యూషన్స్,నిర్వాహకులు రమేష్ & చాయ్ దోస్తీ టీ…

ఆలయ అభివృద్ధికి సుంకిరెడ్డి రూ. లక్ష 70 వేల విరాళం

ఆలయ అభివృద్ధికి సుంకిరెడ్డి రూ. లక్ష 70 వేల విరాళం

కల్వకుర్తి సెప్టెంబర్ 06: తలకొండపల్లి మండలం చుక్కపూర్ ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,టాస్క్ సి.ఓ.ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పన కోసం రూ.1లక్ష డెబ్భై వేల రూపాయల చెక్కును ఆలయ నిర్వాహకులు వెంకటేశ్వర శర్మకు అందజేశారు.అనంతరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు.గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కర్రోలి దశరథం…

బల్మూర్ మండలంలో బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్.!

బల్మూర్ సెప్టెంబర్ 06: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని బల్మూర్ మండల కేంద్రంలో సోమవారం శాంతియుతంగా ధర్నాకు సిద్ధమవుతున్న బీజేపీ మరియు బీజేవైఎం ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.ప్రభుత్వ నిరంకుశ వైఖరికి, పోలీసుల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతుంటే అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. అరెస్టయిన ముఖ్య నాయకులలో బాలస్వామి యాదవ్, బల్మూర్ మండల బీజేపీ అధ్యక్షులు…

కాంగ్రెస్ బాకీ తీర్చాలంటూ బిఆర్ఎస్ వినూత్న నిరసన

.కాంగ్రెస్ చేతిలో మోసపోయిన తెలంగాణ.. పుట్ట రాంరెడ్డి వెల్దండ సెప్టెంబర్ 06:కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను తీర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి అన్నారు.బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పిలుపుమేరకు మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్, మండల పార్టీ మాజీ అధ్యక్షులు కానుగుల జోగయ్యలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు అధిక…

ఐక్యత పౌండేషన్ ఆధ్వర్యంలో నీటి ట్యాంక్ శుద్ధి

వెల్డండ సెప్టెంబర్ 05: వెల్దండ మండలంలోని కుందారం తండా గ్రామంలో నిర్వహించి త్రాగునీటి నిల్వ ట్యాంకులను స్వచ్ఛ ద్వారా కార్యక్రమంలో భాగంగా శనివారం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో జర్మన్ సాంకేతికతతో కూడిన ప్రత్యేక యంత్రాల సహాయంతో శుద్ధి చేయించడం జరిగింది. కార్యక్రమంలో కుందారం తండా గ్రామ సర్పంచ్ గన్య నాయక్, గ్రామ డిప్యూటీ సర్పంచ్ అనిత జంగు ,మరియు వార్డు సభ్యులు ,గ్రామ నాయకులు , యువకులు తదితరులు…

వైద్య విద్యార్థిని సన్మానించిన సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

కల్వకుర్తి సెప్టెంబర్ 05 వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి శేఖర్ గుద్దేటి అలివేల దంపతుల కూతురు గుద్దేటి సరిత నీట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనభర్చి నీట్ కామారెడ్డి ప్రభుత్వ మెడికల్సీ సీటు సాధించిన విద్యార్థిని పాటు తల్లిని గ్రామపంచాయతీ ఆవరణంలో శాలువలతో సన్మానించారు.ఉన్నంత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..గుద్దేటి సరితను ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి లక్ష్యంతో కష్టపడి చదివితే ఉన్నత విజయాలు సాధించవచ్చు అని అన్నారు. అనంతరం విద్యార్థి ఖర్చులకు…

ఘనంగా శ్రీనివాస్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా శ్రీనివాస్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలువెల్డండ సెప్టెంబర్ 5: వెల్దండ మండల ఆర్యవైశ్య సంగం యువ నాయకులు బిక్కు మాండ్ల శ్రీనివాస్ తేజస్విని వివాహ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.పలువురు అభిమానులు, బంధుమిత్రులు శ్రీనివాస్ దంపతులచే కేక్ కట్ చేయించి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పండితులు భాస్కర శర్మ వేద మంత్రాలతో ఆశీర్వచనం చెప్పారు.ఈ కార్యక్రమంలో కర్మంఘాట్ హనుమాన్ నగర్ ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు ఉప్పు బాలస్వామి, ఉప్పు ఆంజనేయులు,…

వైభవోపేతంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం

వైభవోపేతంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంకల్వకుర్తి సెప్టెంబర్ 05: వెల్దండ మండల కేంద్రంలోని బుధవార్‌పేట ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో కనులపండువగా నిర్వహించారు.వేదపండితుల మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ వెంకటేశ్వర స్వామివారి కల్యాణ వేడుకలు వైభవంగా సాగాయి పూరి రాంప్రకాష్ దంపతులు కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డీసీసీ ఉపాధ్యక్షులు ఎన్నం భూపతిరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ సర్పంచ్ మట్ట యాదమ్మ, వెంకటయ్యగౌడ్ హాజరై కల్యాణోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా వారు…

బొల్లంపల్లిలో కమనీయంగా ఉట్ల పండుగ వేడుకలు

వెల్దండ సెప్టెంబర్ 05: వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉట్ల వేడుకలను కమనీయంగా నిర్వహించారు.ఈ వేడుకలకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. శ్రీ కృష్ణ జన్మాష్టమి వంటి పర్వదిన వేడుకలు మన…

గ్రామీణ తపాలా జీవిత బీమాతో పేదలకు ఎంతో మేలు

వెల్దండ సెప్టెంబర్ 05: గ్రామీణ తపాల జీవిత భీమా పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని పోస్ట్ మాస్టర్ పుష్పగిరి రావు అన్నారు.వెల్దండ మండల కేంద్రంలో శనివారం జీవిత బీమా గురించి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ గ్రామీణ తపాల జీవిత భీమా చేసుకోవడానికి 19 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల గల వ్యక్తులు రూ.1000 నుండి 10 లక్షల వరకు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని,ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాలి కోరారు.ఈ కార్యక్రమంలో సబ్ పోస్ట్ మాస్టర్ చందర్, రాజేందర్ రెడ్డి దామర్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.