ముందస్తు అరెస్ట్లు-అసెంబ్లీ ముట్టడికి ముందు ఉద్రిక్తతలు
- రాహుల్కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో గిల్కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

రాష్ట్రంలో అవినీతి, అరాచక కమిషన్ల పాలన కొనసాగుతోందని ఆరోపిస్తూ బీజేపీ పార్టీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, శంకర్పల్లి టౌన్ పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. ముట్టడి కార్యక్రమం సందర్భంగా చట్టసంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలుగా పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యలతో ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు బీర్ల సురేష్ మాట్లాడుతూ, “మా పార్టీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడిని అడ్డుకునేందుకు ప్రభుత్వం భయపడుతోంది. ముందస్తు అరెస్టులతో మా గొంతును మూయలేరు. ప్రజల సమస్యలను ప్రశ్నించే హక్కును ఎవరూ హరించలేరు” అని తెలిపారు. ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, అవినీతి పాలనకు ప్రజలు త్వరలోనే గట్టి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇలాంటి అరెస్టులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ప్రజల స్వరాన్ని అణగదొక్కడమే లక్ష్యమని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ చర్యలు అవసరమని చెబుతున్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడెక్కించే సూచనలు కనిపిస్తున్నాయి.
