సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

తెలంగాణ : సైబరాబాద్ :భార్య ఫిర్యాదుతో భర్తకు చిత్రహింసలు.. ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు ఓ దంపతుల కేసు వ్యవహారంలో భర్తను స్టేషన్ కు పిలిపించి కొట్టారని కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్ సస్పెండు.
ఇటీవల కేపీహెచ్బీ పోలీసులు తనను పోలీసు స్టేషన్లో చిత్రహింసలు పెట్టారంటూ ఓ బ్యాంకు మేనేజర్ ప్రణీత్ ఆరోపించారు.తన భార్య ఇచ్చిన ఫిర్యాదుతో అరికాళ్లు, చేతులపై లాఠీలతో బాదారని చెప్పారు.ఉదయం నుంచి రాత్రి వరకూ తనను కొట్టారని.. అసభ్యంగా దూషించారని దాం ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఘటనపై స్పందించిన సీపీ అవినాష్ మహంతి.. ఇన్స్పెక్టర్ వెంకట్ ను సస్పెండ్ చేశారు. అలాగే ఓ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్.శ్రీనివాస్ పై వేటు ఉన్నతాధికారులు.
