మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మరణించిన నాగమణి కుటుంబానికి 7 లక్షల పరిహారం అందజేత
- రాహుల్కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో గిల్కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

జ్ఞానతెలంగాణ, చేవెళ్ల:
ఈ నెల 3వ తేదీన జరిగిన మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లా, షెడం తాలూకా, బానూర్ గ్రామానికి చెందిన నాగమణి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.7,00,000/- (రూపాయలు ఏడు లక్షలు) ఆర్థిక సాయం ప్రకటించింది.
ఈరోజు చేవెళ్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య నాగమణి కుటుంబ సభ్యులకు నష్టపరిహార చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా కాలే యాదయ్య మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన జరిగిన మీర్జాగూడ బస్సు ప్రమాదం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. చనిపోయిన వారిని తిరిగి తీసుకురావడం సాధ్యం కాకపోయినా, ఆ కుటుంబానికి అండగా నిలవడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబానికి మానవతా దృక్పథంతో 7 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
