Category: నాగర్‌కర్నూల్

తాండ్ర గ్రామంలో శ్రీకృష్ణ హోమం – ఆధ్యాత్మిక భక్తి మార్గదర్శకతే జీవితానికి మార్గం.. మార్కెట్ చైర్మన్ సంజీవ్ యాదవ్

కల్వకుర్తి సెప్టెంబర్ 09 :కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలోని శ్రీ కృష్ణ దేవాలయంలో శ్రీ కృష్ణ హోమం వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ యాదవ్ మాట్లాడుతూ.. భక్తి, ఆధ్యాత్మికతే మనిషి జీవితానికి మార్గదర్శకమని,ఇలాంటి హోమాల వల్ల గ్రామంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని అన్నారు.భగవంతుని ఆశీస్సులతోనే అభివృద్ధి సాధ్యమని, యువత ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జియగూడ యాదవ సంఘం అధ్యక్షుడు జక్కుల చిన్న జంగయ్య యాదవ్, భైరాపూర్ సర్పంచ్ రాజు యాదవ్,…

రాష్ట్రపతి నిలయంలో సత్తా చాటిన వెల్దండ ఏకలవ్య విద్యార్థులు

వెల్దండ సెప్టెంబర్ 09: వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో గల ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీలలో హిందీ గేయం, తెలుగు జానపద గేయం విభాగాల్లో ప్రథమ బహుమతి సాధించి వరుసగా రెండోసారి విజేతలుగా నిలిచారు. విజేతలకు వేదికపై బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ విజయం పాఠశాలకు, మండలానికి గర్వకారణమని ప్రిన్సిపల్ సుమన్ కుమార్, వైస్ ప్రిన్సిపల్…

లింగారెడ్డి పల్లిలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు:-

వెల్దండ మండలం లింగారెడ్డి పల్లి గ్రామంలో పోచమ్మ తల్లి బోనాలు భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. గ్రామంలో నీ ఆడపడుచులు బోనం నేత్తిన ఎత్తుకునీ ఊరంతా డప్పు దరువులు డి జే మోతలతో ఊరేగింపు గా వెల్లి బోనాలను అమ్మా వారికి సమర్పించడం జరింగింది. ఈ ఉత్సవంలో గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ ఫాషా గారు ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య గారు వార్డు సభ్యులు నేతలు కుపిరెడ్డి అశోక్ రెడ్డి గారు, మల్లెపాకుల శేఖర్,పబ్బు…

పేదింటి బిడ్డకు వైద్య విద్యలో సీటు – ఆదుకున్న మాదిగ యువసేన

పేదింటి బిడ్డకు వైద్య విద్యలో సీటు – ఆదుకున్న మాదిగ యువసేనవెల్దండ, సెప్టెంబర్ 09 :వెల్దండకు చెందిన గుద్దేటి శేఖర్ కుమార్తె గుద్దేటి సరిత నీట్ లో ప్రతిభ చాటి కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.నిరుపేద విద్యార్థినిని మాదిగ సంఘం నేతలు ఘనంగా సన్మానించారు. పై చదువుల కోసం మాదిగ యువసేన రూ.17,500, శశిపాల్ రెడ్డి ద్వారా పుష్పగిరి రావు రూ.10,000 చొప్పున మొత్తం రూ.27,500 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో పుల్లయ్య,…

బోనాలు భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలి.. ఎస్సై యుగంధర్ రెడ్డి

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వద్దు ఎస్సై యుగంధర్ రెడ్డివెల్దండ సెప్టెంబర్ 08: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి తో పాటు వివిధ గ్రామాల బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వెల్దండ ఎస్ఐ యుగేందర్ రెడ్డి తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భక్తులు, ఆలయ కమిటీలు, యువకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని, భక్తి గీతాలను మాత్రమే తక్కువ శబ్దంతో వినిపించాలన్నారు.మద్యం సేవించి అల్లర్లు సృష్టిస్తే, శాంతి…

అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తాం.. తహసిల్దార్ కార్తీక్ కుమార్

వెల్దండలో 19,889 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ – తహసీల్దార్ కార్తీక్ కుమార్వెల్దండ సెప్టెంబర్ 08: అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తామని తహసీల్దార్ బీశ్వ కార్తీక్ కుమార్ అన్నారు. మంగళవారం వెల్దండ మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్దండ మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు 19,889 స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరయ్యాయని, అందులో అదనంగా 12…

పోచమ్మ బోనాలు విజయవంతం చేయండి.. సర్పంచ్ ప్రసాద్ గౌడ్

బొల్లంపల్లి, సెప్టెంబర్ 08: బొల్లంపల్లి, చల్లపల్లి, అంకమోనికుంట, ఈదమ్మ బండ తండా గ్రామాల ప్రజలందరికీ బొల్లంపల్లి గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.రేపు బుధవారం సెప్టెంబర్ 9న గ్రామంలోని పోచమ్మ ఆలయంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు*. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. బోనాల వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

దళిత స్పీకర్ ను అవమానించిన తాత మధు పై చర్యలు తీసుకోవాలి.. పుల్లయ్య

వెల్దండ సెప్టెంబర్ 08 : దళిత స్పీకర్ ను అవమానించిన బీఆర్ఎస్ నేత తాత మధు తీరుపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెల్దండ మండలంలో కాంగ్రెస్ సీనియర్ నేత కొయ్యల పుల్లయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. దళిత స్పీకర్ ను అవమానించడం దారుణమని, ఇది బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.తాత మధు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.న్యాయం జరిగే వరకు…

రాజ్యాంగ నిర్మాత సాక్షిగా ప్రజా హక్కులపై వినతి.. భారత రాష్ట్ర సమితి

వెల్దండ సెప్టెంబర్ 08:వెల్దండ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వెల్దండ భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆహార కమిషన్ అధ్యక్షులు గోలి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వినతి చేస్తున్నామని, 2023 ఎన్నికల్లో ఇచ్చిన 6…

స్వచ్ఛమైన నీరు – సంపూర్ణ ఆరోగ్యమే ఐక్యత పౌండేషన్ లక్ష్యం: సుంకిరెడ్డి

వెల్దండ 08: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అంకమోనికుంట గ్రామంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ధార కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఐక్యత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో జర్మన్ టెక్నాలజీతో తయారైన ప్రత్యేక యంత్రాలతో నీటి ట్యాంక్ ను శుభ్రపరిచారు.గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.శుద్ధ జలం అందించి ప్రజల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తున్నామని, ప్రతి బొట్టు స్వచ్ఛత కోసం…