శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొనసాగుతున్న చిరుత ఆపరేషన్

హైదరాబాద్:మే 01
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆపరేషన్ చిరుత ఈరోజు కూడ కొనసాగుతుంది. చిరుతను పట్టుకునేందుకు అధికారులు రెండు, మూడు రోజులుగా శ్రమిస్తున్నారు.

ఆదివారం చిరుత ఫెన్సింగ్ దూకుతుండటం కెమెరాలో రికార్డు అయ్యింది. 7 అడుగుల ఎత్తయిన గోడ దూకి చిరుత రన్‌వే పైకి వచ్చినట్టు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు.

చిరుతను పట్టుకునేందుకు సోమవారం 3 ట్రాప్‌ కెమెరా లు, ఒక బోను ఏర్పాటు చేసిన అధికారులు, మంగళ వారం మరో 6 ట్రాప్‌ కెమెరా లు, 3 బోన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

బోన్ లో ఎర గా మేకను ఉంచి పులిని బంధించేందు కు ప్లాన్ వేశారు అధికారు లు. కాగా, మొన్న సంచరిం చిన ప్రాంతంలోనే మంగళ వారం రాత్రి చిరుత సంచరిం చినట్టు గుర్తించారు.

అక్కడ సమీపంలో నీటి కుంట ఉందని, బహుశా నీటికోసం చిరుత వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మళ్లీ అదే ప్రాంతానికి చిరుత వచ్చే అవకాశం ఉందని, చిరుతకు రెండేళ్లు వయసు ఉంటుందని తెలిపారు…

You may also like...

Translate »