కాంగ్రెస్ పార్టీ ని తెలంగాణాలో బొంద పెడుతాం : ఎమ్మార్పీఎస్

మాదిగలకి ద్రోహం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ

  • తెలంగాణలో 70 లక్షలకు పైగా జనాభా ఉన్న మాదిగలకు ఒక్క పార్లమెంట్ స్థానం కూడ ఇవ్వని కాంగ్రెస్ పార్టీనీ తెలంగాణాలో బొంద పెడుతాం .
  • ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, మరియు అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం
  • ఎం ఎస్ పి రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాసారం శంకర్ రావు మాదిగ
  • ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ.

జ్ఞాన తెలంగాణ మొయినాబాద్ ఏప్రిల్ 09 :

మొయినాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఎమ్మార్పీఎస్ మొయినాబాద్ మండల కన్వీనర్ కొండిగారి మహేందర్ మాదిగ ఆధ్వర్యంలో దహనం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం ఎస్ పి రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాసారం శంకర్ రావు మాదిగ ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పార్లమెంట్ సీట్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు మూడు సీట్లు ఉంటే, రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. దళితుల్లో 20% గళ్ళ మాలలకు రెండు సీట్లు కేటాయించి, ఊరుకొక్కరు లేని బైండ్ల కులానికి ఒక సీటు ఇచ్చిన రేవంత్ రెడ్డి, దళితుల్లో 75% గల మాదిగలకు ఒక్క సీటు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో మల్లు కుటుంబానికి, గడ్డం వివేక్ కుటుంబానికి ఉన్న విలువ మాదిగ జాతికి లేదని, అందుకు కేటాయించిన స్థానాలే సాక్ష్యమని అన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి స్థానికేతరుడై ఉన్నా, స్వయంగా డిప్యూటీ సీఎం సోదరుడైనా, తాను కేబినెట్ హోదాతో ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా నియమించబడి ఉన్నా కూడా మల్లు రవికి అట్టి స్థానాన్ని కేటాయించడం, అదే విధంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో రెండు నియోజకవర్గాల నుండి ఒకే కుటుంబం నుంచి గడ్డం వివేక్,గడ్డం వినోద్ లు చెన్నూరు,బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నా ,మల్లి ఆ పార్లమెంట్ స్థానాన్ని వారి కుటుంబానికే ఇప్పించుకోవడం, వరంగల్ లో మాదిగలను రాజకీయంగా అడుగడుగునా అనిచివేసిన రాజకీయ అవకాశవాధి,ఊరికి ఒక్కరు లేని బైండ్ల కులానికి చెందిన శ్రీహరికి ఇవ్వడం చూస్తుంటే అది అర్ధం అవుతుందని గుర్తుచేశారు. తెలంగాణ లో నాలుగు శాతం జనాభా కలిగిన తమ రెడ్డి కులానికి ఆరు సీట్లను కేటాయించుకున్న రేవంత్ రెడ్డి,12 శాతం జనాభా గల మాదిగలకు స్థానమే లేకుండా చేయడం,50% జనాభా కలిగిన బీసీలకు 2 స్థానాలే కేటాయించి ద్రోహం చేశాడని,కాంగ్రెస్ ముమ్మాటికీ ప్రజా ప్రభుత్వం కాదు,రెడ్ల, మాలల ప్రభుత్వమేనని అన్నారు.మాదిగలకు ద్రోహం చేసిన పార్టీలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని ఇదే ధోరణిని అవలంబిస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రెండు పార్లమెంట్ స్థానాలను మాదిగలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ స్థానాల్లో మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించని కాంగ్రెస్ పార్టీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా పది రోజుల పాటు నిరసన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బాత్యల శివ శంకర్ మాదిగ రంగారెడ్డి జిల్లా ఎం ఎస్ ఎఫ్ అధ్యక్షులు నాని భాను ప్రసాద్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల కో కన్వీనర్ రాజు, బండ్లగూడెం శ్రీనివాస్ మాదిగ,ఊరెంట ప్రవీణ్ కుమార్ మాదిగ,కాడిగల్ల హరీష్ మాదిగ చేవెళ్ల మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »