అంతారం అంబేద్కర్ యూవజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగ సావిత్రి బాయ్ పూలే జయంతి.

అంతారం అంతారం అంబేద్కర్ యూవజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగ సావిత్రి బాయ్ పూలే జయంతి. .
చేవెళ్ల, జ్ఞాన తెలంగాణ : జనవరి 03చేవెళ్ల మండలం, అంతారం గ్రామంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ యూవజన సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి మణికంఠ మరియు ఉపాధ్యక్షులు మేడిపల్లి శ్రీనివాస్. మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే (1831 జనవరి 3– 1897 మార్చి 10) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. ఈ కార్యక్రమంలో అంతారం కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ బాబు, ఉప సర్పంచ్ అనసూయ ఎల్లన్న మరియు వార్డ్ మెంబర్స్, కళాకారులు నర్సింలు అంబేద్కర్ యూత్ సంఘం సభ్యులు, మరియు గ్రామస్తులు పెద్దలు అందరూ పాల్గొని సావిత్రి బాయ్ పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.