6 గ్యారెంటీలు అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

6 గ్యారెంటీలు అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేకపోతే టార్గెట్ రీచ్ కాలేం.. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు, కలెక్టర్లదే.. ప్రజాపాలన పేరుతో గ్రామసభను నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయాలి.. నిస్సహాయులకు ప్రభుత్వం అండగా ఉండి సహాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.