తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్-Vతో సీఎం భేటీ

హైదరాబాద్‌:హైదరాబాద్‌లోని తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్-Vతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో పాటు మంత్రి అజారుద్దీన్‌, సీఎస్‌ సంజయ్‌ జాజు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, సామాజిక రంగాల్లో సహకారం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

You may also like...