మోకిల లో విద్యుదాఘాతం.. ఎంబీఏ విద్యార్థి మృతి
- హయత్నగర్ సమీపంలో ఘోర ప్రమాదం - September 15, 2026
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో విమోచన దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన - September 15, 2026
- తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం భేటీ - September 15, 2026

రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ వసతి గృహం వద్ద విద్యుదాఘాతానికి గురై ఎంబీఏ విద్యార్థి ఆర్య మృతిచెందాడు. ప్రమాదంతో వసతి గృహంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. విద్యుత్ షాక్కు గురైన పరిస్థితులు, ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. వసతి గృహంలో విద్యుత్ వైరింగ్, భద్రతా ప్రమాణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆర్య మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. యువకుడి మృతికి ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించారా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
