ఎంపీ ఆర్ కృష్ణయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆంజనేయులు గౌడ్

వెల్దండ సెప్టెంబర్ 13: జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ.ఆర్. కృష్ణన్నను వెల్దండ మండలంలోని బొల్లంపల్లి వాస్తవ్యులు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ సత్తురి ఆంజనేయులు గౌడ్ కలిసి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 50 ఏళ్లుగా విద్యార్థులు, నిరుద్యోగుల కోసం పోరాడుతున్న కృష్ణన్న సేవలు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆయురారోగ్యాలతో మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.

You may also like...