Daily Archive: September 10, 2026

బాల భరోసా – అనాధ పిల్లలకు భరోసా

కల్వకుర్తి 09: రాష్ట్రంలోని అనాథ పిల్లలు, నిరాశ్రయులు మరియు సంరక్షణ అవసరమైన బాలల సమగ్ర రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం బాల భరోసా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.ఈ పథకం ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులు లేని పిల్లలు లేదా కుటుంబ పోషణ కోల్పోయిన బాలలను గుర్తించి వారికి ప్రభుత్వ సంరక్షణ కల్పించడం. అలాగే బాలల హక్కుల ఉల్లంఘన, బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ బారిన పడకుండా వారిని కాపాడటమని పేర్కొన్నారు.*ధ్రువీకరణ పత్రం ప్రాముఖ్యత:*ఈ పత్రం ద్వారా ఒక చిన్నారిని ప్రభుత్వం…

పోతేపల్లి ప్రభుత్వ పాఠశాలలో దుస్తులు పంపిణీ :

వెల్దండ మండలంలోని పోతేపల్లి ప్రభుత్వ పాఠశాలలో గ్రామ సర్పంచ్ ప్రభుత్వ దుస్తుల పంపిణీ కార్యక్రమంలో పాల్గోని స్వయంగా తన చేతులు మీదుగా దుస్తులు విద్యార్థులకు పంచడం జరిగింది. సర్పంచ్ గారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్నాయి, ప్రైవేటు పాఠశాలలు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తామని తేలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు వార్డు సభ్యులు నేతలు గోరేటి అశోక్ కుమార్…

భూములు కోల్పోతున్న రైతులకు రూ.20 లక్షలు ఇవ్వాలి

వెల్దండ సెప్టెంబర్ 10: డిండి – నార్లాపూర్ డి-82 ప్రాజెక్టులో భాగంగా ఇర్విన్ – అజిలాపూర్ రిజర్వాయర్ లో భూములు కోల్పోతున్న బాధితులు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.అజిలాపూర్ సర్పంచ్ సిద్దగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసిన రైతులు,నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఎకరాకు 20 లక్షలు ఇచ్చిన విధంగా తమకు కూడా పరిహారం ఇవ్వాలని కోరారు.భూములే నమ్ముకుని జీవిస్తున్న తమకు ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకున్నారు. దీనిపై…

డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు

డా. బి.ఆర్. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాల, చేవెళ్లలో నిర్వహిస్తున్న డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించినట్లు కళాశాల కో-ఆర్డినేటర్‌ కె. సూర్యనారాయణ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు....

చందిప్పలో దొంగల బీభత్సం.. వృద్ధురాలిపై కత్తుల దాడి

శంకర్‌పల్లి, సెప్టెంబర్ 10: చందిప్పలో అర్ధరాత్రి నలుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి దోపిడీకి యత్నించారు. వారిని గమనించి అడ్డుకున్న వృద్ధురాలిపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో ముఖం, మెడ భాగాల్లో తీవ్ర గాయాలైన వృద్ధురాలిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా...

అర్ధరాత్రి చందిప్పలో దొంగల బీభత్సం

Source:U.Vamsi,Reporter,621109673 శంకర్‌పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం చందిప్ప గ్రామంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. దోపిడీకి యత్నించిన దుండగులు తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వృద్ధురాలిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. రాత్రి వేళల్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న నలుగురు గుర్తుతెలియని...

స్పీకర్ కు సంఘీభావం తెలిపిన..ఎమ్మెల్యే కసిరెడ్డి

కల్వకుర్తి సెప్టెంబర్ 09 :కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవితో కలిసి బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లను మర్యాదపూర్వకంగా కలిశారు.ఇటీవల శాసనమండలి సభ్యుడు తాతా మధు స్పీకర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు, ప్రవర్తనపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ కు సంఘీభావం తెలిపారు.మంత్రి శ్రీధర్ బాబును కలిసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు…

సీఎంఆర్ఎఫ్ తో పేదలకు ఖరీదైన వైద్యం.. గోలి శ్రీనివాస్ రెడ్డి

మాడ్గుల సెప్టెంబర్ 09: మాడ్గుల మండలం కుభ్యతాండ గ్రామపంచాయతీకి చెందిన నేనావత్ రాజ్యకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.60,000/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.ఆపదలో ఉన్న పేద, సామాన్య కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రజాసేవే లక్ష్యంగా గోలి శ్రీనివాస్ రెడ్డి ముందుకు సాగుతున్నారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్,బీఆర్ఎస్ నాయకులు శ్రీను,లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు.

కాళోజి జయంతిని జల సాధన దినంగా జరుపుకున్న.. జేఏసీ

వెల్దండ, సెప్టెంబర్ 09: చారగొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామ భూ నిర్వాసితుల దీక్షలు 282 రోజులకు చేరాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ పిలుపు మేరకు కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా మంగళవారం వెల్దండ బస్టాండ్ ఆవరణలో జలసాధన దినాన్ని ఘనంగా జరుపుకున్నారు.డిండి ఎత్తిపోతల పథకం రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 12న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో చేపట్టనున్న సత్యాగ్రహ దీక్ష కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల…

బండోనిపల్లిలో స్మార్ట్ కార్డులు రేషన్ కార్డుల పంపిణీ – లబ్ధిదారులలో ఆనందం

వెల్దండ, సెప్టెంబర్ 09 : వెల్దండ మండలంలోని బండోనిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ ఎనుముల సంగీత – శేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ అల్వాల్ యాదవుల ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్,ఉప సర్పంచులుమాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా రేషన్ అందుతుందని, ప్రభుత్వ సంక్షేమ…