కంటోని పల్లిలో అంబరాన్ని తాకిన “జైశ్రీరామ్ నినాదాలు”

వెల్దండ సెప్టెంబర్ 07: వెల్దండ మండలంలోని కంటోనీపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి శోభాయాత్ర కనులపండువగా జరిగింది. గ్రామ ఆంజనేయస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర ప్రధాన వీధుల మీదుగా సాగింది.కాషాయ కండువాలు ధరించిన యువకులు, భక్తులు 'జై శ్రీరామ్, జై హనుమాన్' నినాదాలతో హోరెత్తించారు. ఆంజనేయస్వామి విగ్రహాన్ని భుజాలపై మోస్తూ భక్తి శ్రద్ధలతో ఊరేగించారు.గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో వేడుకల్లో పాల్గొంటూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివ మధుసూదన్,రవి,సురేష్, బాలస్వామి, ఆకుల శ్రీను తో పాటు గ్రామ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, భక్త బృందం, గ్రామస్తులు పాల్గొన్నారు.

You may also like...