అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్..శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లు
- రాహుల్కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో గిల్కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్..శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లు
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్.. శబరిమల క్షేత్రాన్ని దర్శించుకొనేందుకు వెళ్లేవారి కోసం దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ డిసెంబర్- జనవరి మాసాలలో వివిధ తేదీలలో మొత్తంగా 51 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. వివిధ తేదీలలో రాకపోకలు కొనసాగించే ఆ రైళ్ల నెంబర్లు, తేదీలతో పాటు పలు వివరాలను మంగళవారం ‘ఎక్స్’లో షేర్ చేసింది. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, సెకెండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని అధికారులు తెలిపారు.
