రేపు దిల్లీకి బీజేపీ ఎంపీలు

హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు రేపు దిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు వారు పర్యటించనున్నట్లు సమాచారం. దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను ఎంపీలు కలవనున్నారు.రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కేంద్రం నుంచి అవసరమైన సహకారం వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై సమగ్ర వినతిపత్రాన్ని అందజేయనున్నట్లు సమాచారం….