ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన (pmjjby)

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన (pmjjby) ఇన్స్యూరెన్స్ ద్వారా సాలిమెడ శ్రీనివాస్ గారు మరణించినందున వారి భార్య ఉజ్జీవ గారికి 2 లక్షల రూపాయల ఇన్స్యూరెన్స్ బీబీపేట యూనియన్ బ్యాంకు మేనేజర్ గారు హర్షద్ అలీ గారు, సబ్ మేనేజర్ కృష్ణప్రసాద్ , ఫీల్డ్ ఆఫీసర్ మనోజ్ , యశ్వంత్ , ఆనంద్ , జనగామ  బ్యాంకింగ్ కరస్పాండెంట్ లలిత లింగం , ఇతర బ్యాంకు సిబ్బంది కలసి cheque అందచేయటం జరిగింది.

వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం

వెల్దండ మండల పరిధిలోని బర్కత్ పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు.ఆదివారం వెల్దండ మండల మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి పోతేపల్లి సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాలతో అభినందించి  సత్కరించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

కల్వకుర్తిలో 2 కే రన్ పోటీలు ప్రారంభిచిన ఎమ్మెల్యే కసిరెడ్డి

* నాగర్‌ కర్నూల్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో బాలురు, బాలికల కోసం మొదటి 2కే రన్ క్రీడా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి హాజరై, 2కే రన్ క్రీడా పోటీలను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా చిన్నారులు, యువ క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.అనంతరం పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే  బహుమతులు అందజేసి అభినందించారు.గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని  సూచించారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, కల్వకుర్తి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం,కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్,పట్టణ మరియు మండల స్థాయి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు,క్రీడా సంఘం నిర్వాహకులు, కార్యకర్తలు, అభిమానులు, క్రీడాకారులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హైవే పక్కన వాహనాల నిలిపివేత మృత్యుశకటాలుగా మారుతున్న రహదారులు అక్రమ పార్కింగ్‌తో ప్రాణాలకు ముప్పు

రోడ్డు పక్కన ఆపిన వాహనమే ప్రాణం తీస్తే.. ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి…కట్టంగూర్: హైదరాబాద్‌–విజయవాడ 65వ జాతీయ రహదారిపై అక్రమ పార్కింగ్‌ వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. కట్టంగూర్‌ మండల పరిధిలోని అయిటిపాముల నుంచి పామనుగుండ్ల వరకు హైవే పక్కన భారీ లారీలు, కంటైనర్లు, ఇతర వాహనాలను ఇష్టారాజ్యంగా నిలిపివేస్తున్నారు. ముఖ్యంగా దాబాలు, హోటళ్ల వద్ద రోడ్డుపైనే వాహనాలను నిలిపి డ్రైవర్లు విశ్రాంతి తీసుకుంటుండటంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉంది.

పిల్లల సృజనాత్మకత శారీరక ఎదుగుదలపై అవగాహన

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 29: కల్వకుర్తి మండలం లోని రాచాలపల్లి గ్రామంలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం వర్క్‌షాప్, అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో 1, 2వ తరగతుల విద్యార్థులు, వారి తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు జ్ఞానాన్ని పెంపొందించడం, తల్లులు పిల్లలతో అనుబంధాన్ని పెంచుకోవడం, డ్రాయింగ్ వంటి సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. 

రామేశ్వరం పల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

రామేశ్వరం పల్లి PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్గారు.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరు – భిక్కనూర్‌లో ఏర్పాటు చేస్తున్నాం: షబ్బీర్ అలీ

మెరుగైన బోధనకు కాంప్లెక్స్ సమావేశాలు దోహదం : పాఠశాల విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎం. సోమిరెడ్డి

విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన బోధన అందించడంలో కాంప్లెక్స్ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయని పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఎం. సోమిరెడ్డి అన్నారు. శనివారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఇంగ్లీష్ కాంప్లెక్స్ సమావేశాన్ని ఆయన సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. వివిధ పాఠశాలల్లో అమలు చేస్తున్న వినూత్న బోధనా పద్ధతులను పరస్పరం పంచుకోవడం ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరచవచ్చన్నారు.

రాష్ట్రపతి భవన్ రాఖీ వేడుకల్లో పాల్గొన్న ఏకలవ్య విద్యార్థి

రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఎ. వైష్ణవి పాల్గొన్నారు.భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించడం పాఠశాలకు ఎంతో గర్వకారణమని ప్రిన్సిపాల్ సుమన్ కుమార్ తెలిపారు.

ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌పై ఎంఐఎం వేటు

ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్‌ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు పార్టీ జాయింట్‌ సెక్రటరీ ఎస్‌ఏ హుస్సేన్‌ అన్వర్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా తన ఎమ్మెల్సీ పదవికి కూడా వెంటనే రాజీనామా చేసి, ఆ రాజీనామా...

డిండి ఎత్తిపోతల పథకం అంశంపై సమీక్ష సమావేశం

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 27: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులతో అత్యవసర సమీక్షా సమావేశం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించబడింది.ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని చారగొండ మండలం పరిధిలోని గోకారం గ్రామ రైతుల భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో పాటు,ఎర్రవల్లి గ్రామపంచాయతీ మరియు...