సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో 56 ఉద్యోగాలు

Image Source | ETV Bharat
UPSC ‘కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024’ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో 56 కేటగిరీ1, కేటగిరీ 2 పోస్టులను భర్తీ చేయబోతున్నారు.
అర్హత: మాస్టర్ డిగ్రీ(జియోలాజికల్ సైన్స్/ జియాలజీ/అప్లైడ్ జియాలజీ/జియో ఎక్స్ప్లోరేషన్/ మినరల్ ఎక్స్రేషన్/ ఇంజినీరింగ్ అప్లైడ్ జియో ఫిజిక్స్/మెరైన్ జియోఫిజిక్స్/ అప్లైడ్ జియోఫిజిక్స్/ కెమిస్ట్రీ/ అప్లైడ్ కెమిస్ట్రీ/ అనలిటికల్ కెమిస్ట్రీ/ హై ద్రోజియాలజీ), ఎంఎస్సీ (టెక్) అప్లైడ్ జియోఫిజిక్స్, వయసు 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక పరీక్ష విధానం: స్టేజ్ 1 కంబైన్డ్ జియోసైంటి స్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), స్టేజ్ 2కంబైన్డ్ జియోసైంటిస్ట్ (మెయిన్ ఎగ్జామినేషన్ డిస్కి ప్టివ్ టైప్), స్టేజ్ 3 పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టో బర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాం గులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) చెల్లించాలి. ప్రిలిమ్స్ 2024 ఫిబ్రవరి 18, మెయిన్స్ జూన్ 22న నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం కోసం www.upsc.gov.in వెబ్ సైట్లో సంప్రదించాలి.
