మాజీ గవర్నర్ సుశీల్ కుమార్ షిండేతో శ్రీనివాస్ గౌడ్

కల్వకుర్తి సెప్టెంబర్ 04 : వెల్దండ మండలం పెద్దా పూర్ గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ కాంట్రాక్టర్ కమ్మగొని శ్రీనివాస్ గౌడ్ ముంబైలో మాజీ హోం మంత్రి, మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండేను మర్యాదపూర్వకంగా ప్రత్యక్షంగా కలసి వారికి 86వ జన్మదిన శుభాకాంక్షలు మరియు ఆత్మీయ అభినందనలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మాజీ రక్షణ మంత్రిగా మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్‌గా ప్రజా జీవితంలోనూ,దేశ సేవలోనూ వారు అందించిన అసాధారణమైన సేవలు ఎంతో స్ఫూర్తిదాయకం మరియు ఎల్లప్పుడూ ఎంతో గౌరవంతో గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.

You may also like...