బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా పులకరం శంకర్
- కాంగ్రెస్ తీరుపై చిరుమర్తి లింగయ్య ధ్వజం - September 11, 2026
- మంచినీటి సమస్యల తలెత్తకుండా చర్యలు : సర్పంచ్ ముక్కామల శ్యామల - September 11, 2026
- కట్టంగూర్ ఎంఈఓగా మైనం శ్రీలత బాధ్యతల స్వీకరణ - September 11, 2026
కట్టంగూర్, సెప్టెంబర్ 11 : బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా మండలంలోని ఎరసానిగూడెం గ్రామానికి చెందిన పులకరం శంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకట్ రెడ్డి నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రైతులు ఎదురొటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను రైతులకు వివరించి జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి తన వతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన జిల్లా మండల నాయకులకు కృతజ్ఞతల తెలిపారు.
