తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- రాహుల్కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో గిల్కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

- సర్వదర్శనానికి 12–15 గంటల నిరీక్షణ.. హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లిన భక్తులకు 12 నుంచి 15 గంటల వరకు నిరీక్షణ తప్పడం లేదు. అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోగా, భక్తుల క్యూలు శిలాతోరణం వరకు విస్తరించాయి.
సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 4 నుంచి 6 గంటల సమయం పడుతుండగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ (శీఘ్ర) దర్శనానికి కూడా 3 నుంచి 5 గంటల నిరీక్షణ కొనసాగుతోంది. వారాంతం కావడంతో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించిన వివరాల ప్రకారం, శుక్రవారం మొత్తం 71,668 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 32,975 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ద్వారా రూ.4.16 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు, తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సేవలు తదితర సౌకర్యాలను విస్తృతంగా కల్పిస్తున్నారు.
