తలకొండపల్లిలో మట్టి వినాయకుల ఉచిత పంపిణీ

తలకొండపల్లి: కల్వకుర్తి నియోజకవర్గం, తలకొండపల్లి మండల కేంద్రంలో జై శ్రీరాం యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుల ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కటికల శేఖర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యూత్ వ్యవస్థాపకులు పద్మ అనిల్ ముదిరాజ్, అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పద్మ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విగ్రహాలను శ్రీకాంత్ యాదవ్ అందించారు.వార్డు సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే సందేశాన్ని చాటారు.

You may also like...