సీఎంఆర్ఎఫ్ తో పేదలకు ఖరీదైన వైద్యం.. గోలి శ్రీనివాస్ రెడ్డి

మాడ్గుల సెప్టెంబర్ 09: మాడ్గుల మండలం కుభ్యతాండ గ్రామపంచాయతీకి చెందిన నేనావత్ రాజ్యకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.60,000/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.ఆపదలో ఉన్న పేద, సామాన్య కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రజాసేవే లక్ష్యంగా గోలి శ్రీనివాస్ రెడ్డి ముందుకు సాగుతున్నారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్,బీఆర్ఎస్ నాయకులు శ్రీను,లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు.

You may also like...